Telangana Assembly: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని విపక్షాలు ఎప్పటినుండో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వివిధ పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగుల తరపున అనేక ఆందోళనలు చేపడుతూ ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉంటే నిన్న వనపర్తి లో జరిగిన బహిరంగ సభలో.. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు రేపు టీవీ చూడాలని.. 10 గంటలకు భారీ ప్రకటన చేయబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించడం జరిగింది. అయితే కెసిఆర్ చెప్పినట్టుగానే నేడు అసెంబ్లీ సాక్షిగా ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో లక్షా 2, 250 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీనిలో భాగంగా కొత్తగా 91,147 ఖాళీలు ఉండగా వాటిలో 80,039 పోస్టులకు… నేడే నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో తెలంగాణ నిరుద్యోగులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
ఇక ఇదే సమయంలో 11,103 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు చేశారు. అటెండర్ నుండి ఆర్డిఓ వరకు స్థానికులకే అవకాశం కల్పిస్తున్నట్లు..తెలిపారు. అంతేకాకుండా ఇక నుండి ప్రతియేటా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. అంత మాత్రమే కాక గరిష్ట వయోపరిమితి 10 ఏళ్లకు పెంపు చేసే దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పై కేసీఆర్ సీరియస్ అయ్యారు. తెలంగాణకు సంబంధించి కొన్ని సమస్యల విషయంలో కేంద్రం సహకరించడం లేదని తెలిపారు.
దేశంలోనే అతి తక్కువ అప్పులు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల విషయంలో అర్ధరహితమైన వివాదం నడుస్తుందని ముఖ్యంగా విద్యుత్ ఉద్యోగాల సమస్య.. తీవ్ర తరం అయిందని సుప్రీంకోర్టు దాకా వెళ్లిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్లే ఉద్యోగ నియామకాల విషయంలో అర్థరహిత వివాదాలు తలెత్తాయి అని కెసిఆర్ ఆరోపించారు. ఏది ఏమైనా దాదాపు లక్షకుపైగా ఉద్యోగాలకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేయడంతో ఉస్మానియా యూనివర్సిటీలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు.