రాజకీయాల్లో అందరూ అంటే ఏమో అనుకుంటాం కానీ రాత్రికిరాత్రే బండ్లు ఓడలు అవుతాయి…. ఓడలు బండ్లు అవుతాయి. దీనిని ఎంతో మంది రాజకీయ నాయకులు నిరూపించారు కానీ ఒక్కరికే అనేకసార్లు దురదృష్టం తలుపు తట్టడం…. ఆ తలుపులు తెరచి దానిని సాదరంగా లోనికి ఆహ్వానించిన మన రాజకీయ నాయకుల సంఖ్య మాత్రం చాలా తక్కువ. అటువంటి కొద్దిమందిలో అమలాపురం మాజీ ఎంపీ సీనియర్ నాయకుడు జి.వి.హర్షకుమార్ ఒకరు. ప్రస్తుతం అతని రాజకీయ భవిష్యత్తు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్.
మొదటి అడుగే….
హర్షకుమార్ ఒకప్పుడు కాంగ్రెస్ టికెట్ పై అమలాపురం నుండి రెండు సార్లు విజయం సాధించారు. వైయస్ కు అనుంగు అనుచరుడిగా హర్షవర్ధన్ మంచి పేరు తెచ్చుకున్నారు. 2004, 2009 ఎన్నికల్లో ఏకపక్షంగా ఎంపీగా విజయం సాధించారు. అయితే రాష్ట్ర విభజన ఎఫెక్ట్ తో అతని జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. మొదటి అడుగే ఎంతో తప్పుగా వేశారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన సమైక్యాంధ్ర పార్టీలో చేరి 2014లో అమలాపురం పార్లమెంటు స్థానం నుండి ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. కట్ చేస్తే….
అవకాశాన్ని కాలదన్నుకున్నారా?
అమలాపురం సిట్టింగ్ ఎంపీగా ఉన్న హర్షకుమార్ ఖచ్చితంగా విజయం సాధిస్తారు అని అందరూ అనుకున్నారు. పైగా సమైక్య ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో అతని వైపు కావాల్సినంత సానుకూలత ఉంది అని అభిప్రాయపడ్డారు. అయితే కేవలం తొమ్మిది వేల ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయారు హర్షకుమార్. సమైక్యాంధ్ర పార్టీ ఎత్తేయడంతో అతనికి ఏం చేయాలో పాలుపోలేదు. టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికంగా సమాచారం జరిగింది. అయితే అదే సమయంలో అతనికి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది వైసీపీ పార్టీ నుండి అతనికి ఆహ్వానం లభించింది. ఎంతైనా తన తండ్రికి ఆప్తుడు.. తనకు బాగా దగ్గర ఉంటే బాగుండు అని జగన్ ఆలోచించారు ఏమో కానీ…. కట్ చేస్తే….
పోయి పోయి భలే వారిని నమ్మారు….
టిడిపికి చేరువైనా హర్షకుమార్ దూకుడు చూసి వైసిపి నాయకులు అతనిని తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు వెనక్కి తగ్గారు. గత ఏడాది ఎన్నికల్లో అమలాపురం టికెట్ తనకే దక్కుతుందని హర్షకుమార్ ఆశించారు. అతనికి స్థానికంగా మంచి మద్దతు కూడా ఉంది. అయితే చంద్రబాబు మాత్రం ఆ టికెట్ ను సెంటిమెంట్ కోసం రాజకీయం దివంగత స్పీకర్ మోహనచంద్ర బాలయోగి కుమారుడికి ఇచ్చి అతనికి సహకరించాలని హర్షకుమార్ ను కోరాడు. ప్రభుత్వం ఏర్పడ్డాక న్యాయం చేస్తామని మాట ఇచ్చారు కానీ హర్షకుమార్ మాత్రం దీనికి ఒప్పుకోలేదు. ఇక ఇలాంటి పరిస్థితులలో వైసీపీకి టీడీపీకి దూరంగా ఉన్నారు.
ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే హర్షకుమార్ మళ్లీ కాంగ్రెస్లో కి వెళ్తాను అని చివరికి ప్రకటించారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అతన్ని కళ్ళకు అద్దుకుని తీసుకుంటుంది అని అందరూ భావించారు. వారికి ఇలాంటి దూకుడు గల నాయకులే కావాలి అయితే అతను తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్తున్నాను అని ప్రకటించి 24 గంటలు గడిచినప్పటికీ ఆ పార్టీ నుండి సానుకూల స్పందన లేకపోవడం గమనార్హం. హర్ష కుమార్ పరిస్థితికి ఏ పేరు పెడతారో ఇక మీ ఇష్టం….