మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. పాన్ ఇండియన్ సినిమాగా 5 భాషల్లో రిలీజ్ కానుండగా నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ కోసం సుకుమార్ అండ్ అల్లు అర్జున్ టీం కేరళ వెళ్ళనున్నారట. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో లాంగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేయగా రష్మిక మందన్న కూడా ఈ షెడ్యూల్ లో జాయిన్ కాబోతుందని సమాచారం.
కాగా ఈ సినిమా తర్వాత సుకుమార్ చేయబోయో మరో పాన్ ఇండియన్ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫైటర్ అన్న వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తుండగా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఇన్నాళ్ళు లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుంచి మొదలవుందని సమాచారం. కాగా ఈ సినిమా కమొలీట్ చేసి ఆ తర్వాత విజయ్ దేవరకొండ సుకుమార్ సినిమా కోసం సిద్దం కానున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే సుకుమార్ – విజయ్ దేవరకొండ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.
విజయ్ దేవరకొండ స్నేహితుడు కేదార్ సెలగం శెట్టి మొదటిసారి నిర్మాతగా మారి చేస్తున్న ఈ సినిమాకోసం 150 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా కథా నేపథ్యం గురించి కూడా ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. పీరియాడిక్ బ్యాక్ డ్రా లో పాకిస్తాన్ – ఇండియా విడిపోయినప్పటి పరిస్థుతుల ఆధారంగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని సుకుమార్ తెరకెక్కించనున్నాడట. చూడాలి మరి ఇందులో ఎంతవరకు నిజముందో.