దివంగత పరిటాల రవి 16 వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లాలో పరిటాల అనుచరులు టిడిపి నాయకులు ఏర్పాటు చేసిన పరిటాల రవి ప్లెక్సీ గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి వేయటంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కంబదూరం మండలంలోని కదిరిదేవరపల్లి గ్రామంలో పరిటాల అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కావాలని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటిండంతో పరిటాల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలాఉంటే పరిటాల వర్ధంతి సందర్భంగా ఆయన భార్య మాజీ మంత్రి పరిటాల సునీత మరియు కుమారుడు శ్రీరామ్ వెంకటాపురం లోని స్థూపం వద్ద నివాళులు అర్పించారు. సునీత తన మనవడి చేతుల మీదగా నివాళులర్పించారు. రవి వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు రక్త అన్నదానాలు చేస్తున్నారని ఎందుకు సంతోషంగా ఉందని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. మరోపక్క ఫ్లెక్సీల వివాదం టిడిపి వర్సెస్ వైసిపి పార్టీ అన్నట్టు అనంతపురం లో టెన్షన్ వాతావరణం నెలకొంది.