ఏపీలో వైసిపి పార్టీ మెజార్టీ గెలవడం తోనే స్టార్టింగ్ లోనే టిడిపి పార్టీ లో వలసల రాజకీయం స్టార్ట్ అయింది. గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ టీడీపీ ఎంపి రాయపాటి సాంబశివరావు… బిజెపి లోకి వెళ్దామని ముందుగానే రెడీ అయిపోయారు. మీడియాకు కూడా తెలియజేయడం జరిగింది. అయితే అప్పట్లో బిజెపి పార్టీకి అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉండటంతో…. రాయపాటి ఎంట్రీని ఢిల్లీ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కన్నా అడ్డుకోవడం జరిగింది.
మొదటి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఒకే జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నాయకులు ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించేవారు. చాలాసార్లు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వీరిద్దరి వివాదాలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా కూడా అయ్యేవి. అలాంటి తరుణంలో వైయస్ మధ్యవర్తి గా ఉంటూ ఎప్పటికప్పుడు పంచాయతీ చేస్తూ ఇద్దరిని డీల్ చేసే వారు.
అయితే ఎప్పుడైతే వైయస్ మరణించారో, రాష్ట్ర విభజన జరిగిందో కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన రాయపాటి టిడిపి కండువా కప్పుకొని 2014 ఎన్నికలలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడిగా గెలవడం జరిగింది. ఆ తర్వాత ఇంకా టిడిపిలో సెటిలై పోదాం అని భావించారు. కానీ అనూహ్యంగా 2019 ఎన్నికల్లో టిడిపి ఘోరంగా విఫలం అవడంతో బీజేపీలో చేరడానికి మొదటిలో ప్రయత్నించిన రాయపాటికి… కన్నా లక్ష్మీనారాయణ అడ్డుపడగా, తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు పోస్ట్ నుండి కన్నా ని బీజేపీ హైకమాండ్ తప్పించడంతో … రాయపాటికి బీజేపీ లో ఎంట్రీ ఇవ్వడానికి మార్గం సుగమం అయినట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో త్వరలో టిడిపి పార్టీకి రాజీనామా చేసి స్ట్రాంగ్ రీ-ఎంట్రీ బిజెపిలో ఇవ్వడానికి రెడీ అయినట్లు గుంటూరు రాజకీయాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో రాయపాటి మంతనాలు జరిపినట్లు, వాళ్లు కూడా ఓకే అన్నట్లు త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని రాయపాటి బిజెపి కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం.