భారత్-చైనా సరిహద్దు భద్రత విషయంలో కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దులలో ఇటీవల డ్రాగన్ కంట్రీ తో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకోవడంతో….దూకుడుగా వ్యవహరిస్తున్న డ్రాగన్ కంట్రీ పై పటిష్టమైన నిఘా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల భారత్ – చైనా సరిహద్దు లలో చైనా ఆర్మీ భారీ ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రితో దేశం లో ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు బయటపడటంతో కేంద్రం డ్రాగన్ పై నిఘా పెంచడానికి నాలుగు నుంచి ఆరు కృత్రిమ సాటిలైట్స్ అందుబాటులోకి తెచ్చారు. ఇవి సరిహద్దుల వెంబడి ప్రతి కదలికను కనిపెడుతూ క్లియర్ గా ఫోటోలు కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉండి కూడా తీయగల సామర్థ్యం కలిగి ఉన్న సాటిలైట్స్.
వీటిని ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం సహా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఈ ఉపగ్రహాలు ద్వారా మరింత డేగకన్ను డ్రాగన్ కంట్రీ పై భారత్ పెట్టడానికి రెడీ అయింది. ఈ రాష్ట్రాల సరిహద్దుల వెంబడి మరోపక్క చైనా సైనిక బలగాలు ఉన్న కొద్దీ మోహరీస్తున్న తరుణంలో…. అంతర్జాతీయంగా చైనా ఇండియా వార్ రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
జూన్ 15వ తారీఖు నాడు లడక్ సరిహద్దు ప్రాంతం వద్ద చైనా ఆర్మీ…భారత సైనికుల పై దాడి చేసి 20 మందిని పొట్టన పెట్టుకున్నప్పుడే రెండు దేశాల మధ్య యుద్ధమేఘాలు అలుముకున్నాయి. చైనా చాలా వరకు భారత్ ను తక్కువ అంచనా వేసినా…తమతో యుద్ధానికి భారత్ రాదని భావించింది. కానీ అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం… చైనా కి అదే రీతిలో డి అంటే డి అన్నట్టు విధంగా, ఏకంగా ప్రధాని మోడీ చైనా సరిహద్దు ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న సైనికులకు కంటికి కన్ను పంటికి పన్ను అన్న రీతిలో ప్రసంగించడం తో చైనా వెనక్కి తగ్గింది.
అయితే ఇటీవల భారత సరిహద్దుల చుట్టూ రౌండప్ చేసి వ్యవహరిస్తున్న తరుణంలో…డ్రాగన్ కంట్రీ ఏమాత్రం దేశం లోకి రాకుండా శాటిలైట్ ఉపగ్రహాల ద్వారా ప్రతి కదలికను గుర్తించడానికి రెడీ అయింది.