మధుమేహం, గుండె జబ్బులు, ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి వేడి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. రోగాలను దరి చేరనివ్వకుండా శరీరాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంది.
మరి, వేడి నీటి వల్ల శరీరానికి కలిగే ఆ ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు.. ఇతరాత్ర ఉదర సంబంధిత వ్యాధులకువేడినీళ్లు మంచి ఔషదం.వేడి నీటిని త్రాగడం వలన మనకు కలిగే ప్రధానమైన ఉపయోగం మనం డాక్టర్ ని సంప్రదించవలసిన అవసరమే రాదు.
అధిక బరువు, ఊబదగ్గు, పడిశంతో బాధపడుతున్నవారు గోరు వెచ్చని నీరు తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
వేడి నీళ్లు రక్త ప్రసరణ పెంచడంతోపాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
వేసవి కాలంలో సైతం డిహైడ్రేడ్ సమస్య తీర్చేందుకు వేడి నీరు ఉపయోగపడుతుంది.
గొంతు సమస్యలు దరి చేరువు.
జలుబు, న్యూమోనియా సమస్యలనూ వేడి నీళ్లతో అధిగమించవచ్చు.
మధుమేహం వస్తుందనే అనుమానం ఉంటే.. వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.
కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఆర్థరైటీస్ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత, కాలకృత్యాల కంటే ముందుగానే రెండు లేదా మూడు గ్లాసుల గోరు వెచ్చని నీటిని తాగేయాలి. నీటిని ఒక్కసారిగా గొంతులో వేసుకోని మింగేయకుండా నోటిలోనే ఉంచుకుంటూ నెమ్మదిగా గుటకలు వేస్తూ మింగండి. ఇలా రోజూ చేస్తే చాలా తక్కువ సమయంలోనే చక్కని ఫలితాలు చూడవచ్చు.
పురుషులు 3.7 లీటర్లు, స్త్రీలు 2.6 లీటర్లు చొప్పున తాగడం మంచిది. ఉదయం వేళ తాగే వేడి నీటిలో ఒక నిమ్మ బద్ద పిండుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది..వేడి నీరు త్రాగడం వలన ఎప్పటికీ మధుమేహం రాదు. శరీరం అనవసరంగా బరువు పెరగటం జరుగదు. స్దూలకాయం రాదు. మీరు జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే, మీకు ఔషధాలు అవసరం లేకుండా ఉండాలంటే, మనం ఎప్పుడూ రోగగ్రస్తులం కాకుండా పూర్తిశక్తి సామర్ధ్యాలతో ఉండాలంటే..వేడినీళ్ళు తాగడం అత్యుత్తమమార్గం.