Tirupati by election: తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఉప ఎన్నికలలో 28 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, 17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలో తిరుపతి లోక్ సభ పరిధిలో 2470 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో చిత్తూరు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో1056 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
అదే విధంగా నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోలింగ్.. జరుగుతుండగా 1414 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉప ఎన్నిక విధులలో 10,850 మంది పోలింగ్ సిబ్బంది కరోనా నిబంధనల మధ్య విధులు నిర్వహిస్తున్నారు. ఇంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు మధ్య పోలింగ్ జరుగుతుండగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రెండు చోట్ల గ్రామస్తులు పోలింగ్ బహిష్కరించాలి అని డిసైడ్ అయ్యారు.
మాజీ మంత్రి బొజ్జల స్వగ్రామం ఊరందరూ తో పాటు నారాయణ గ్రామంలోనూ ఎన్నికల బహిష్కరణ అంటూ నాయకులు మరియు ప్రజలు ఒకే తాటిపై ఉన్నారు. కారణం చూస్తే శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో తమ గ్రామాల విలీనం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ రెండు గ్రామాలలో ప్రజలు నాయకులు కూడా ఎవరు ఓటు వెయ్యలేదు.