అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ను టార్గెట్ చేస్తూ..టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ‘శకుని మామా’ అని పేర్కొంటూ తన ట్విట్టర్ ఖాతాలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మీ తుగ్లక్ జగన్ ఇసుకని కూడా లేకుండా చేసి కార్మికుల్ని నడిరోడ్డుమీద పడేశాడు. పిల్లికి బిచ్చం పెట్టని మీరు పేదలకు పరమాన్నం పెడతారనుకోవడం భ్రమ శకుని మామా!… దాదాపు 70 లక్షల మంది ఉపాధి కోల్పోయేలా చేసిన మీరు కూడా ఇసుక గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది శకుని మామా! టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రజలకు ఉచితంగా ఇసుకని ఇచ్చారు. కార్మికుల కడుపు నింపారు’ అని ఆయన పేర్కొన్నారు.
‘ఢిల్లీలో కూర్చొని కాళ్లు పట్టుకునే నీకు, అపాయింట్ మెంట్ దొరక్క కాలుగాలిన పిల్లిలా పచార్లు చేస్తున్న మీ తుగ్లక్ జగన్ కి విశ్వసనీయత అంటే అర్థం తెలియదు శకుని మామా. మీ తప్పుల్ని చంద్రబాబు ఎండగడుతుంటే అంత ఉలిక్కిపడుతున్నావ్, త్వరలో తీహార్ వెళ్లాల్సి వస్తుందనా?’ అని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు.
మీ తుగ్లక్ @ysjagan మాత్రం ఉన్న ఇసుకని కూడా లేకుండా చేసి కార్మికుల్ని నడిరోడ్డుమీద పడేసాడు. పిల్లికి బిచ్చమ్ పెట్టని మీరు పేదలకు పరమాన్నం పెడతారనుకోవడం భ్రమ శకుని మామా !#NoSandNoWorkInAP
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) October 22, 2019
ఢిల్లీలో కూర్చుని కాళ్ళుపట్టుకునే నీకు, అపాయింట్మెంట్ దొరక్క కాలుగాలిన పిల్లిలా పచార్లు చేస్తున్న మీ తుగ్లక్ @ysjagan కి విశ్వసనీయత అర్ధం తెలుసనుకోవడంలేదు శకుని @VSReddy_MP మామా! మీ తప్పుల్ని చంద్రబాబుగారు ఎండగడుతుంటే అంత ఉలిక్కిపడుతున్నావ్, త్వరలో తీహార్ వెళ్లాల్సి వస్తుందనా?
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) October 22, 2019