అమరావతి: ఈవిఎంలు భద్రపరిచిన కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసిపి నేత విజయసాయి రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరాకు శనివారం ఆయన లేఖ రాశారు.
ఎన్నికల సంఘంనికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సహకరించడం లేదనీ, ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించవద్దని ముఖ్యమంత్రే నేరుగా రాష్ట్ర ఎన్నికల అధికారికి చెబుతున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు.
ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద రాష్ట్ర పోలీసులకు బదులు సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ బలగాలను మోహరించాలని విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. అన్ని స్ట్రాంగ్ రూమ్లలో 24 గంటలు సిసి టివి కెమెరాలు పనిచేసేలా అమర్చాలని విజయసాయి రెడ్డి కోరారు.
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం బాగా పని చేసిందని విజయసాయి రెడ్డి అన్నారు. నిస్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించిందని విజయసాయి రెడ్డి లేఖలో పేర్కొన్నారు.