Delhi Riots .. దేశ రాజధాని సాక్షిగా రైతులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ War ని తలపిస్తోంది. అసలు రైతుల వెనుకున్నది ఎవరు? అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. Indiaకి అన్నం పెట్టే Farmer ఒక వైపు.. వ్యవస్థల్ని కాపాడే Police మరో వైపు. ప్రజలకు బాసటగా నిలవాల్సిన వీరిద్దరి మధ్య జరిగిన ఘర్షణ ప్రజలను విస్మయంలో పడేస్తోంది. India Freedom కోసం జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో గోడలెక్కి పారిపోతున్న భారతీయులను బ్రిటిషర్లు కాల్చి చంపిన ఘటన మనం సినిమాల్లో చూశాం. అంతటి హింస లేకపోయినా ఇక్కడ మన రైతులే.. మన పోలీసులపై చేసిన దాడికి వాళ్లు గోడలు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఏకంగా 300 మంది పోలీసులు రైతుల చేతిలో దెబ్బలు తిని గాయపడ్డారు. ఒక రైతు మృతి చెందాడు. Indiaలో అందునా Capital Delhiలో జరిగిన ఈ దారణం ప్రపంచానికి India నుంచి వెళ్లాల్సిన సంకేతాలు కాదు.
ప్రధానికే రక్షణ బాధ్యత పట్టదా..?
దేశ ప్రధాని ఏదైనా రాష్ట్రానికో, ప్రాంతానికో పర్యటనకు వెళ్తేనే అత్యంత పకడ్బందీగా రక్షణ కల్పిస్తారు. రెండు రోజుల ముందుగానే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకుంటాయి. స్థానిక పోలీసులు ఎంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. అటువంటిది ఢిల్లీలో.. అందునా గణతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో వేలాది మంది రైతులు ఆ ప్రాంతానికి ఎలా చేరుకున్నారనేది ప్రశ్నగా మారింది. నిజంగా ఇది నిఘా వైఫల్యమే. సాధారణ పరిస్థితుల్లో ప్రధానికి కట్టుదిట్టమైన రక్షణ కల్పించి.. వేలాది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీలో నిరసనలకు వస్తున్నారని తెలిసి ఇంకెంత భద్రత తీసుకోవాలి? కానీ.. పోలీసుల వైఫ్యల్యంతో ఏకంగా రైతులు ఎర్రకోటపైకి చేరుకునే వరకూ పరిస్థితులు వెళ్లాయంటే ఇది భారత్ కే అవమానం. అదీ.. రిపబ్లిక్ డే రోజున ప్రధాని వస్తున్న సమయంలో. స్థానిక పరిస్థితులు తెలిసి ఆ ప్రాంతానికి వచ్చే దారులన్నీ మూసేయాల్సిన పోలీసులు, నిఘా వ్యవస్థ సరిగా పని చేయలేదు. చెప్పిన రూట్ కాకుండా వేరే మార్గంలో రైతులు అక్కడికి చేరుకున్నారన్నది పోలీసులు చెప్తున్న మాట. ఇది సరైంది కాదు.
కేంద్రం తీరే కారణమా..?
ఇంతటి దారుణమైన పరిస్థితులు ఏర్పడటానికి కేంద్ర ప్రభుత్వ తీరే కారణమా? అంటే అవుననే సమాధానమే చెప్పాలి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పట్టుబట్టిన రైతులు నెలలు గడుస్తున్నా వెనకడుగు వేయడం లేదు. మొన్నటివరకూ పంజాబ్, హర్యానా వరకే పరిమితమైన ఆందోళన ఇప్సుడు మహారాష్ట్ర వరకూ చేరుకుంది. ఏకంగా ట్రాక్టర్లతో నిరసన తెలిపుతూ ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటికి రైతులతో 9 సార్లు చర్చలు జరిపి కేంద్రం సాధించింది శూన్యం. సుప్రీంకోర్టు చొరవ తీసుకుని కేంద్రానికి మొట్టికాయలు వేయడంతో కొన్నాళ్లపాటు వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేస్తామని ప్రకటించడం తప్ప కేంద్రం చేసింది ఏమీ లేదు. అసలెందుకు బలవంతంగా వ్యవసాయ చట్టాలు అమలు చేస్తున్నారో ఇప్పటికీ కేంద్రం స్పష్టం చేయడం లేదు. వారు చెప్తున్న కారణాలను రైతులు కూడా ఒప్పుకోవడం లేదు. ఎవరూ తగ్గడం లేదు.. ఇద్దరూ దేనికీ అంగీకరించడం లేదు. కార్పొరేట్ పాలనగా పేరుబడ్డ బీజేపీ ప్రభుత్వ తీరు.. పారిశ్రామిక దిగ్గజాలకు కొమ్ముకాస్తున్నారనే నింద ఉన్న ప్రధాని మోదీనే ఇందుకు కారణం అని చెప్పాలి.
Delhi Riots రైతుల వెనుకున్నది ఎవరు..?
2008లో వ్యవసాయ చట్టం తీసుకురావాలన్న పంజాబ్ రైతులే ఇప్పుడు ఈ చట్టాలు వద్దంటున్నారు. రైతులే ఇలా అనడంతో వీరి వెనుక ఎవరో ఉండి ఈ తతంగం నడిపిస్తున్నారని బీజేపీ మాట. కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన పంజాబ్ లో రైతుల వెనుక కాంగ్రెస్ ఉండి ఇదంతా నడిపిస్తుందా అనే వాదనా లేకపోలేదు. సంయుక్త్ కిసాన్ మోర్చా, రైతు సంఘాలు కేంద్రంపై పోరాటానికే ముందుకెళ్తున్నాయి. ఎవరి ప్రోద్బలం చూసుకుని వారు నెలలుగా ఢిల్లీలో పోరాటం చేస్తున్నారనేదే ప్రశ్న. కాంగ్రెస్ హయాంలో కావాలని.. బీజేపీ హయాంలో వద్దంటున్న రైతులను మాత్రం ఎంతకు నమ్మేది. ఉత్తరాదిలో మూడు రాష్ట్రాలకే పరిమితమైన ఉద్యమం దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోని రైతులకు ఎందుకు పట్టడం లేదనేది కూడా మరొక ప్రశ్న. ఏపీ మొదటే వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇస్తే.. తెలంగాణ మొదట్లో వ్యతిరేకించి ఇప్పుడు మద్దతిస్తోంది. రైతులను ప్రభుత్వం మీద దాడికి పంపిస్తే ఎవరికి ఉపయోగం అనేది తేలాల్సిన అంశం. ఈస్థాయి ఆందోళన దేశవ్యాప్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వానిదే..!