రాయలసీమకు జగన్ మరో వరం ఇచ్చారు. ఇప్పటికే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మూడు టీఎంసీల నీరును ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రకటించిన జగన్ ఇప్పుడు అదే రాయలసీమకు విద్యుత్ వెలుగులు పంచడానికి రెడీ అయ్యారు. రాయలసీమకు ఉపాధి పరిశ్రమలు తీసుకురావడానికి పరిపాలనలో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాయలసీమలో వెనుకబడిన కరువు జిల్లాలకు కరువు తీరేలా జగన్ వేసిన ప్లాన్ లు తెలుసుకుని సీమవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020 ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. మొదటి ప్రతిపాదనగా రాయలసీమ ప్రాంతంలో 3, 5 గిగా వాల్ట్ సామర్ధ్యం గల అల్ట్రా వాల్ట్ మెగా రెన్యువబుల్ ఎనర్జీ పవర్ బాక్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. కాగా పాలసీ ప్రకారం ప్రాజెక్టు అభివృద్ధి ప్రోత్సహించే నోడల్ ఏజెన్సీ గా ఉండే ఆంధ్రప్రదేశ్ కి చెందిన పలు ప్లాంట్లు ఇప్పటికే ఓకే చెప్పడం జరిగింది. దీంతో చాలావరకు పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లు రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటయ్యేలా నిరంతరం విద్యుత్ అందేలా ఆ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి కల్పన తీసుకురావటానికి జగన్ కృషి చేస్తున్నారు.