Telangana BJP: తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు పార్టీ హైకమాండ్ గుడ్ న్యూస్ అందించింది. బండికి పార్టీలో కీలక పదవి ఇవ్వడంతో ఆయన అభిమానులు ఊరట చెందారు. ఇటీవల ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించి, ఆ బాధ్యతలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు నిరుత్సాహానికి గురైయ్యారు. అయితే బండి సంజయ్ కు కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది కానీ అవన్నీ ప్రస్తుతానికి ఊహగానాలుగానే మిగిలాయి. ఈ తరుణంలో పార్టీ అధిష్టానం బండి సంజయ్ ను జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణను కొనసాగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.
ఏపీకి చెందిన సత్య కుమార్ కు జాతీయ కార్యదర్శిగా మరో సారి అవకాశం కల్పించింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా సత్యకుమార్ ను నియమించే అవకాశాలు ఉన్నాయని తొలుత వార్తలు వచ్చినా పార్టీ అధిష్టానం దగ్గుబాటి పురందరీశ్వరికి అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఆయన ను మరో సారి జాతీయ కార్యవర్గంలో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్ కు జాతీయ కార్యవర్గంలో బాధ్యతలను అప్పగించడంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ఆయన చేస్తున్న సేవలకు మంచి గుర్తింపు లభించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Vijayasai Reddy: ‘ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పని చేయడం ఎందుకు..?’