Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోమారు తన దూకుడు మంత్రంతో ముందుకు సాగుతున్నారు. పాదయాత్రతో మళ్లీ పార్టీ నేతల్లో జోష్ నింపేందుకు సంజయ్ ప్రయత్నిస్తున్నారు. త్వరలో పాదయాత్ర నిర్వహించాలని ఆయన సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి బర్కత్పురాలోని హైదరాబాద్ సెంట్రల్ ఆఫీసులో పాదయాత్ర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Read More: Bandi sanjay: సచ్చిపోత కేసీఆర్… బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు…
సంజయ్ కీలక వ్యాఖ్యలు…
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పాదయాత్ర ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. TRS ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని, ప్రాజెక్టులు, కమిషన్లకే పరిమితమైందని సంజయ్ అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడం, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడం, కుటుంబ పాలనను అంతమొందించడమే లక్ష్యమని బండి సంజయ్ అన్నారు. తన పాదయాత్రతో తెలంగాణలో పెను మార్పులు ఖాయమన్నారు. సమావేశంలో పాదయాత్ర ఇంచార్జ్ గా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డిని నియమించారు. పాదయాత్రలో నడిచేందుకు వేల మంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని, కాని ప్రతి జిల్లా నుంచి 20 మందికి మాత్రమే అవకాశం కల్పించామని సంజయ్ చెప్పారు.
Read More: BJP: పెగాసస్… బీజేపీ సర్కారు బుక్కయిపోతున్నట్లేగా!
పాదయాత్రతో దూకుడు…
అధికార పార్టీపై ఎదురుదాడి చేయడం , ప్రజా సమస్యలను ప్రస్తావించడం లక్ష్యంగా బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం కోసం సంజయ్ ముందుకు సాగుతున్నారని చెప్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేలా సెప్టెంబర్ 17వ తేదీని ఎంచుకున్నారని అంచనా వేస్తున్నారు.