BJP: పెగాసస్ సాఫ్ట్వేర్, ఫోన్ ట్యాపింగ్ ఉదంతం మన దేశంలో ప్రకపంనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెగాసస్ విషయంలో విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్రతిరోజూ పార్లమెంట్ ఉభయసభలలో ఈ అంశంపై చర్చించాలని ప్రతిక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో అధికార పార్టీని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ ఒరవడిలో మరో ముందడుగు వేశాయి.
Read More: Modi: మోడీ విషయంలో చాలా మంది చేయలేని పని ఈ యువ మంత్రి చేసేశాడు
ఏం జరుగుతోందంటే..
పెగాసస్ పై చర్చించాలని కొన్ని రోజులుగా విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అందుకు ఒప్పుకోవట్లేదు. దీంతో ఉభయ సభల్లో విపక్ష నేతలు ఆందోళనలకు దిగుతుండడంతో గందరగోళం నెలకొంటోంది. వాయిదాల పర్వం కొనసాగుతోంది. తాజాగా పెగసస్ అంశంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు కూడా లేఖ రాశాయి. దీంతో ఈ ఉదంతం ముదిరిపాకాన పడుతోందని, బీజేపీ బుక్కవడం ఖాయమంటున్నారు.
Read More : Modi: అటు గవర్నర్లు…ఇటు మంత్రులు. .మోడీ లెక్క ఏంటో తెలుసా?
తగ్గేదే లే…
లోక్సభ లో పెగాసస్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు విపక్ష ఎంపీలు కలిసి వాయిదా తీర్మానానికి గురువారం నోటీసులు ఇచ్చారు. అంతకు ముందు ప్రతిపక్ష పార్టీల నాయకులు పార్లమెంటు వద్ద సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చించారు. మరోవైపు, పెగాసస్పై సంబంధిత అధికారులను సమాచార సాంకేతికతకి చెందిన పార్లమెంటరీ ప్యానెల్ ప్రశ్నించనుంది. కేంద్ర ఐటీ, హోంశాఖకు చెందిన పలువురు అధికారులు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మొత్తంగా అన్ని మార్గాలలో కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని అంటున్నారు.