BJP: తెలంగాణ బీజేపీ కొత్త జోష్తో ముందుకు సాగుతోంది. ఇద్దరు ముఖ్య నేతలు పార్టీకి కొత్త ఊపు ఇచ్చేందుకు ముందుకు సాగుతున్నారు. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఓ వైపు జన ఆశీర్వాద యాత్రకు శ్రీకారం చుట్టగా , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ద్వారా పార్టీ శ్రేణులతో కలిసి జోష్ పెంచేందుకు సిద్ధమయ్యారు.
Read More: Bandi Sanjay: బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్.. ట్విట్టర్లో కొత్త యుద్ధం
జన ఆశీర్వాద యాత్రతో కిషన్ రెడ్డి…
కేంద్రంలో బీజేపీ పాలనకు 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి “జన ఆశీర్వాద యాత్ర“ పేరుతో యాత్ర చేపట్టనున్నారు. యాత్ర పొడవునా బీజేపీ ప్రభుత్వ విజయాలు, సంక్షేమ కార్యక్రమాలను కిషన్ రెడ్డి వివరిస్తూ ముందుకు సాగుతారు. ఈనెల 19 నుంచి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర ప్రారంభం అవుతుంది. 3 రోజులపాటు 384 కిలోమీటర్లు సాగనున్న ఈ యాత్ర 12 జిల్లాలు, 18 అసెంబ్లీ నియోజకవర్గాలు,7 పార్లమెంటు నియోజకవర్గాల గుండా వెళుతుంది. కిషన్ రెడ్డి యాత్ర మధ్యలో బీజేపీ శ్రేణులు 40 చోట్ల సభలు ఏర్పాటు చేశాయి.
Read More: Kishan reddy: కిషన్ రెడ్డికి ఇంకో గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని
బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’
నియంతృత్వ కుటుంబ పాలన, అవినీతి విముక్తి కోసం శంఖారావం పూరిస్తూ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపట్టనున్నట్లు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. బండి సంజయ్ చేపట్టనున్న పాదయాత్ర షెడ్యూల్ ను తాజాగా పార్టీ నేతలు విడుదల చేశారు. పాదయాత్ర ఈనెల 24న చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఆలయంలో పూజాదికాలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభిస్తారు. ఎగ్జిబిషన్ మైదానంలో పాదయాత్ర ప్రారంభ సభ జరుగుతుంది.