Malla Reddy: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. మేడ్చల్ జిల్ల మూడుచింతలపల్లి మండలం కేశవరంలో 47 ఎకరాల గిరిజనుల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని శామీర్ పేట పోలీస్ స్టేషన్ లో బిక్షపతి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మార్వోతో పాటు మల్లారెడ్డి పై ఫిర్యాదు రావడంతో పోలీసులు వారిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు తొమ్మిది మందిపైనా 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు అయ్యింది.
శామీర్ పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలో సర్వే నెంబర్ 33,34,35 లో గల 47 ఎకరాల 18 గుంటల ఎస్టీ (లంబాడీల) వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు తొమ్మిది మంది అక్రమంగా కబ్జా చేసి, కుట్రతో మోసగించి భూమిని కాజేశారని పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
విచారణ చేపట్టిన పోలీసులు మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అనుచరులు, మల్లారెడ్డి బందువు శ్రీనివాసరెడ్డి, కేశవాపుర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరిమోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ వైస్ చైర్మన్, శామీర్ పేట మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై పోలీసులు కేసు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Big Breaking: లోక్ సభలో టెన్షన్..టెన్షన్..టియర్ గ్యాస్ వదిలిన ఆగంతకులు ..పరుగులు తీసిన ఎంపీలు