సినిమాల్లో నటించే నటీనటులకు ఒకానొక సమయంలో మంచి క్రేజ్ ఉండేది. వారు కనిపిస్తే ప్రాణం వచ్చినట్లు ఫీల్ అయ్యే వారు అభిమానులు. ఇదంతా ఒకప్పటి మాట.. ఇప్పుడు సినిమాల్లో నటించే నటీనటులతో పాటు సమానమైన క్రేజ్ ని సంపాదించుకుంటున్నారు సీరియల్స్ నటీనటులు. వీరికి కూడా అదే తరహా ఫాలోయింగ్ దక్కుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రతి ప్లాట్ఫారం లోను నటీనటులకు అభిమానులు ఏర్పడుతున్నారు. అలా కొందరు నటినటులు మంచి గుర్తింపు సంపాదించుకుంటుంటే మరికొందరు విలన్స్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల నుంచి ఘోర తిట్లను కూడా ఎదుర్కొంటున్నారు. ఇక ఒకానొక సమయంలో సినీ తారలు మాత్రమే ప్రేమించి పెళ్లిళ్లు చేసుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో సీరియల్ నటీనటులు కూడా ఈ కోవాలోనే చేరుతున్నారు. ఒక సీరియల్ లో నటించేటప్పుడు ప్రేమించుకోవడం అనంతరం ప్రేమలో పడడం వంటివి చేస్తూ ఆ తర్వాత పెద్దల అంగీకారంతో ఒకటవుతున్నారు. ఇక మరికొందరు అయితే పెద్దలు ఒప్పుకోకపోవడంతో సొంత నిర్ణయాలతో పెళ్లిళ్లు చేసుకున్న నటీనటులు కూడా ఉన్నారు. ఇక 2024 లో కూడా పలువురు బుల్లితెర నటి నటులు పెళ్లిళ్లు చేసుకోబోతున్నారు. మరి వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
1. శోభ శెట్టి – యశ్వంత్ రెడ్డి:
కార్తీకదీపం సీరియల్ లో మౌనిత పాత్ర పోషించి ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మౌనితగా పేరు సంపాదించుకుంది. ఇక బిగ్ బాస్ స్టేజ్ పై తన ప్రియుడిని పరిచయం చేసింది. అతని యశ్వంత్ రెడ్డి. కార్తీకదీపం సీరియల్ లో కార్తీక్ తమ్ముడి పాత్ర పోషించాడు యశ్వంత్ రెడ్డి. ఇక వీరిద్దరూ ఈ సంవత్సరంలోనే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.
2. కావ్య – నిఖిల్:
వీరిద్దరూ తెలుగులో మొట్టమొదటిగా నటించిన సీరియల్.. గోరింటాకు. ఈ సీరియల్లో వీరిద్దరి జంటకి అనేకమంది ప్రేక్షకులు ఏర్పడ్డారు. ఇక ఈజ్ అంటే అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్ లో కూడా నటించింది. ఇక వీరిద్దరి జంటకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరు కూడా 2024 లో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తుంది.
3. ప్రియాంక – శివకుమార్:
మౌనరాగం సీరియల్ లో జతకట్టిన వీరిద్దరూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఇటీవలే ప్రియాంక బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి తన ప్రియుడిని పరిచయం చేసింది. వీరిద్దరికీ ఇటీవలే పెళ్లయిపోయినట్లు అనేక ప్రచారాలు జరిగాయి. ఇక వీటిపై ప్రియాంక ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
4. కీర్తి – విజయ్ కార్తీక్:
వీరిద్దరూ కూడా ఇండస్ట్రీకి సంబంధించినవారే. అయితే కలిసి ఏ సీరియల్ లోను నటించలేదు. కీర్తి మనసిచ్చి చూడు, కార్తీకదీపం వంటి సీరియల్స్ లో నటించి మెప్పించింది. బిగ్బాస్ కి వెళ్లి వచ్చి భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఇప్పటికే కీర్తికి మరియు విజయ్ కార్తీక్ కి ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్లి ఈ సంవత్సరంలో చేసుకోనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.
5. కృష్ణారెడ్డి – స్వాతి:
ముద్దమందారం, ముత్యమంత ముగ్గు వంటి సీరియల్స్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణారెడ్డి ప్రస్తుతం పెద్దగా నటించడం లేదు. ఇక రీసెంట్ గానే స్వాతి అనే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు కృష్ణారెడ్డి. వీరిద్దరి పెళ్లి ఈ సంవత్సరంలో జరగనుంది.
6. మహేష్ కాళిదాసు – సాండ్రా:
వీరిద్దరూ కలిసి ఈ మధ్యనే తీర్థ క్షేత్రాలకు తిరిగివచ్చారు. ఆ ఫొటోస్ తోనే అర్థమైంది వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని. నిజానికి సాండ్రా కి మొదట ఓ పెళ్లి జరిగింది. కానీ తన భర్తకి తనకి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంది. ఇక సాండ్రా ని రెండో పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతున్నాడు మహేష్. వీరి పెళ్లి కూడా ఈ సంవత్సరంలోనే జరగనున్నట్లు తెలుస్తుంది.
ఇలా పలువురు సీరియల్ జంటలు 2024లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నారు.