Guppedantha manasu: బుల్లితెర ప్రేక్షకుల మనసును గెలుచుకున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ 567వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు 2022 సెప్టెంబర్ 29న ప్రసారం కానున్న గుప్పెడంత మనసు సీరియల్లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో వసు మీద కోపంతో రిషి ఆవేశంగా గుడి గంటని కొట్టడతో రిషి చేయి తెగుతుంది. వెంటనే వసు ఏడుస్తూ హాస్పిటల్ కి వెళదాం అని అడగడంతో రిషి కోపంగా వసుని బస్ స్టాప్లో దించేసి కాలేజ్ గెస్ట్ హౌస్కి వచ్చి సోఫాలో పడుకుంటాడు.ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తిగా సాగింది.
వసు, రిషిల మధ్య గొడవ తగ్గేనా..?
అక్కడే వసు,రిషిల మధ్య కాసేపు చర్చ జరుగుతుంది.నన్ను నా ఆలోచనల్ని మార్చాలని ప్రయత్నం చేయకు వసు ఇప్పటికే చాలా సార్లు చెప్పాను ఇక్కడ నుండి వెళ్లిపో అంటాడు రిషి కోపంగా మీరు ఇక్కడ నుంచి వెళ్తేనే నేను వెళ్తాను అంటుంది వసు. ‘నా మనసేం బాలేదు.. నేను ఇప్పుడు వెళ్లను’అంటాడు రిషి. ‘సరే నేను వెళ్లను సార్.. మీకేనా మనసుంది? నాకు కూడా ఉంది కదా?’ అంటుంది వసు బుంగమూతి పెట్టి. ఇంట్లో అంతా మీకోసం కంగారు పడుతుంటారు.. మీరు వెళ్తేనే నేను వెళ్తాను’ అంటుంది వసు ఎమోషనల్గా.ఫోన్ తీసుకునిఏదో నొక్కి రిషి ఆవేశంగా వెంటనే బయటికి వెళ్లిపోతాడు. వసు కూడా వెనుకే వెళ్తుంది.వసు వెంట రావడం చూసి ఏంటి వసుధారా ఇలా తయారయ్యావ్?’ అంటాడు రిషి. ‘ఇంటికి వెళ్లండి సార్’ అంటుంది వసు. ‘క్యాబ్ వచ్చింది వెళ్లు’ అంటాడు.
క్యాబ్ లో వసును ఇంటికి పంపించిన రిషి :
ఇందాక ఫోన్ లో రిషి క్యాబ్ బుక్. చేశాడాన్నమాట. అయితే వసు వెళ్లి క్యాబ్లో కూర్చుంటుంది. రిషి కారు తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. ఇక జగతీ, మహేంద్రా రిషి కోసమే టెన్షన్ పడుతూ ఉంటారు. దేవయాని రాగానే అక్కయ్యా ఒక్కసారి రిషికి కాల్ చేయండి ప్లీజ్.. మా ఫోన్స్ లిఫ్ట్ చేయట్లేదు’ అంటుంది. దేవయాని క నేను చేయను’ అంటుంది పొగరుగా. అప్పుడే ధరణీ.. ‘నేను చేస్తాను అత్తయ్యా.. రిషి నా ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తాడు’ అంటుంది. ‘నేను ఇక్కడ సమాధానం చెబుతున్నాను కదా.. నోరుమూసుకుని లోపలికి వెళ్లు ధరణీ’ అంటూ తిడుతుంది… ఇంతలో రిషి ఇంటికి వస్తాడు. జగతీ, మహేంద్ర, గౌతమ్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. రిషి చేయి కట్టు చూసి అంతా కంగారు పడి ఏమైంది అని అడిగితే అద్దం గీసుకుంది. కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేయండి’ అనేసి లోపలికి వెళ్లిపోతాడు రిషి.
రిషి ఇంటికి వచ్చిన వసు :
ఇక కాసేపటికి వసు డైరెక్ట్గా రిషి ఇంటికి రావడమే కాకుండా దేవయాని కళ్ల ముందే రిషి రూమ్లోకి వెళ్తుంది. ఇదేంటి ఇలా వెళ్లిపోతుంది అనుకుంటుంది దేవయాని.వసును చూసిన రిషి భ్రమ అనుకుంటాడు.రిషిని తిన్నారా టాబ్లెట్స్ వేసుకున్నారా సార్ అని వసు అడుగుతుంటే.. ‘నువ్వు ఇంకా మాయం కావట్లేదు ఏంటీ?’ అంటాడు రిషి. ‘మాయం అవ్వడం ఏంటీ సార్’ అంటుంది వసు. రిషికి అర్థమవుతుంది వసు నిజంగానే వచ్చిందని.మరోవైపు దేవయాని అందరిని మీ అందరి కడుపు నిండిపోయే పని చేస్తాను చూద్దురు రండి అంటూ కంచంలో అన్నం పెట్టుకుని రిషి దగ్గరకు వెళ్తుంది. గదిలోకి వెళ్లిన దేవయాని పక్కనే ఉన్న వసుధారను తప్పుకో అని రిషి అన్నం తిను నాన్నా.. టాబ్లెట్స్ వేసుకుందువు గానీ’ అంటూ ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేస్తుంది దేవయాని.‘నాకు ఆకలిగా లేదు పెద్దమ్మ తినలేను’ అంటాడు రిషి.
దేవాయానికి షాక్ ఇస్తూ రిషికి అన్నం తినిపించిన వసు :
వెంటనే వసు ‘ఏంటి సార్ మీరు.. ఎందుకు తినరు? తినాల్సిందే ఇటు ఇవ్వండి మేడమ్ అంటూ దేవయాని చేతిలో ఉన్న అన్నం పళ్లెం తీసుకుని రిషికి ముద్దలు చేసి.ఆ పట్టండి సార్ అంటూ తినిపిస్తుంది. ‘ఇదేంటి వసుధార ఇంత దూకుడుగా ఉంది’ అనుకుంటాడు రిషి మనసులో.ఆ సీన్ చూసి జగతీ మహేంద్ర, గౌతమ్ వాళ్లంతా సంబరంగా ఉంటే.. దేవయాని మాత్రం షాక్ లో ఉంటుంది. కాసేపు అయ్యాక అందరూ పక్కకు జారుకుంటారు. దేవయాని కూడా మళ్లీ వస్తాను అని వెళ్లిపోతుంది. అప్పుడు వసు రిషికి ఎదురుగా కూర్చుని తినిపిస్తూ.. మధ్యమధ్యలో వాటర్ పట్టిస్తూ.. చున్నీతో తుడుస్తూ ప్రేమగా చూసుకుంటుది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!