Gayatri Simhadri: ఒకప్పుడు స్టార్ మాని షేక్ చేసి భారీ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్ ఏదైనా ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ కార్తీకదీపం అని చెప్పుకోవచ్చు. అంతులేని ట్విస్టులతో కొనసాగిన ఈ సీరియల్ ప్రతిఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇటీవలే ఈ సీరియల్ కి సీక్వెల్ ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమాలకే కాదు సీరియల్స్ కి కూడా సీక్వెల్స్ ఉంటాయని మాటకి అర్థం చెప్పారు ఈ మూవీ మేకర్స్. ఇక ఈ సీరియల్ మొన్నటి నుంచి రాత్రి 8 గంటలకి స్టార్ మా లో ప్రసారమవుతుంది. నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్ లు ప్రధాన పాత్రలలో పోషిస్తున్న కార్తీకదీపం సీరియల్ అప్పట్లో భారీ విజయం సాధించింది.
మరి ఇప్పుడు ఈ సీక్వెల్ ఎంత మేరా రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి. కార్తీకదీపం సీరియల్ సూపర్ సక్సెస్ కావడంతో తిరిగి అదే పేరుతో కార్తీకదీపం నవవసంతం అనే టైటిల్ని ఫిక్స్ చేస్తూ ఈ సీక్వెల్ ని రూపొందించారు మేకర్స్. పార్ట్ 1 ని డైరెక్ట్ చేసి జాతీయస్థాయిలో నెంబర్ 1 సీరియల్ గా నిలబెట్టిన కాపుగంటి రాజేంద్ర పార్ట్ 2 ని కూడ డైరెక్ట్ చేయడం విశేషం. అయినా కార్తీకదీపం అంటే దీప మరియు కార్తిక్ తో పాటు మౌనిత కూడా ఉండడం చాలా ముఖ్యం. నిజానికి సీరియల్లో వంటలక్క పాత్రకి ఎంతైతే క్రేజ్ ఉందో మౌనిత పాత్రకి కూడా అంతే. కార్తీకదీపం లో వంటలక్క పాత్ర ఎంత ఇంపార్టెంట్ మౌనిత పాత్ర కూడా అంతే ఇంపార్టెంట్. గతంలో మౌనిత పాత్రలో పోషించిన శోభ శెట్టికి మంచి ఫాలోయింగ్ దక్కింది. కానీ ఈ నవవసంతం లో మాత్రం మౌనిత కనిపించలేదు. దీంతో ప్రతి ఒక్కరు అనేక అనుమానాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు.
అంతేకాకుండా మౌనిత లేనిదే ఈ సీరియల్ సక్సెస్ అవ్వదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు కూడా. నిజానికి మౌనిక లాంటి లేడీ విలన్ పాత్ర పార్ట్ 2 లో కూడా ఉంది. కానీ ఆ ప్లేస్లో మౌనిత లేదు. ఆ ప్లేస్ లో మరో నటి చేరింది. ఆమె మరవ్వరు కాదు జోష్ణ. కార్తీకదీపం పార్ట్ 1 లో మౌనిత పేరు ఎలాగైతే వినిపిస్తుందో పార్ట్ 2 లో కూడా జోష్నా పేరు ఆ విధంగానే వినిపిస్తుంది. కార్తీకదీపం నవవసంతంలో జోష్ణ గా నటిస్తున్న నటి పేరు గాయత్రి సింహాద్రి. ఈమెను గాయత్రి మున్ని సింహాద్రి అని కూడా పిలుస్తూ ఉంటారు. విలనిజం పండించడంలో మౌనితనే తలదన్నే క్యారెక్టర్ని పోషిస్తుంది అనే బిరుదు సైతం ఈమెకి ఉంది.
గతంలో అనేక నెగిటివ్ రోల్స్ లో నటించి ప్రతి ఒక్కరిని మెప్పించింది ముద్దుగుమ్మ. జీ తెలుగులో సూపర్ హిట్ అయిన త్రినయని సీరియల్లో కాశి పాత్రలో విలన్ షేడ్స్ ను ప్రదర్శించింది ఈ ముద్దుగుమ్మ. ఇక అంతకుముందు జీ తెలుగులో సూపర్ ఫ్యామిలీ, ఈటీవీలో జోష్ వంటి ఎంటర్టైన్మెంట్స్ కార్యక్రమాలకు యాంకరింగ్ చేసింది కూడా. ఇక మోడలింగ్లో అనుభవం ఉన్న గాయత్రి సింహాద్రి ఫోటో షూట్లతో గ్లామర్ డోల్ గా కనిపిస్తుంది. ఇక కార్తీకదీపం 2 లో జోష్నాగా నెగిటివ్ రోల్స్ లో కనిపించనుంది ఈ ముద్దుగుమ్మ. తమిళ్లో సూపర్ హిట్ అయిన చెల్లమ్మ సీరియల్ ని తెలుగులో కార్తీకదీపం 2 గా రీమేక్ చేస్తున్నారు. ఇక ఒరిజినల్ వర్షన్ లో జోష్న.. కార్తీక్ ని ఇష్టపడుతుంది. ఇక కార్తీక్ సేమ్ ఫస్ట్ పార్ట్ లో లాగానే వంటలక్కపై మనసు పాడేసుకుంటాడు. అలా ఈ కథాంశం మొత్తం కొనసాగుతుంది. ఏదేమైనా ఈ సీరియల్లో మౌనిక కనిపించకపోవడంతో ప్రతి ఒక్కరు నిరాశకు గురయ్యారు అని చెప్పుకోవచ్చు.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!