Manasu Mamatha: ప్రస్తుత కాలంలో సినీ సెలెబ్రిటీలనే కాదు.. బుల్లి తెర నటీనటులు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ అనంతరం విడిపోతూ ఉంటున్నారు. ఇక ఇప్పటికే ఇటువంటి కేసులు ఎన్నో నమోదయ్యాయి. ఇక తాజాగా ఓ బుల్లి తెర జంట విడిపోయింది. బుల్లితెర ఇండస్ట్రీకి ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ప్రేమలో పడి.. నిజ జీవితంలో భార్యాభర్తలు గా మారిన సీరియల్ ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు. ఆ తరుణంలోకి వస్తారు మానస మరియు ప్రియతమ్ చరణ్ కూడా. వీరిద్దరి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. మానస సీరియల్ యాక్టర్ గా తన కెరీర్ను ప్రారంభించి ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించి మెప్పించింది. అదేవిధంగా ప్రియతమ్ కూడా సీరియల్ ఆర్టిస్టుగా ఆయన కెరీర్ను ప్రారంభించాడు.
అదేవిధంగా 10 సినిమాల్లో సైతం సపోర్టివ్ రోల్స్ లో నటించాడు ప్రియతమ్. ఇక ఈయన కెరియర్ని పూర్తిగా మలుపు తిప్పిన సీరియల్ మనసు మమత అనే చెప్పుకోవచ్చు. ఈ ఒక్క సీరియల్ తో ప్రియతమ్ కి మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతానికి పాపే మా జీవనజ్యోతి అనే సీరియల్ లో నటిస్తున్నాడు ప్రియతమ్. ఇక మానస సైతం ముద్దమందారం, గిరిజా కళ్యాణం వంటి సీరియల్స్ లో నటిస్తూ మెప్పిస్తుంది. అలా సీరియల్ ఆర్టిస్టులుగా తమ కెరీర్ ప్రారంభించి అనంతరం పెళ్లి చేసుకున్నారు ఈ జంట. ఇక వీరిద్దరికీ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.
అప్పటివరకు ఎంతో అన్యోన్యంగా ఉన్నా ఇటీవల కాలంలో విడివిడిగా ఉంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఒకానొక సమయంలో మానసనే వీటిపై స్పందిస్తూ స్వయంగా వెల్లడించింది. కొన్ని పరిస్థితి వాళ్ళ మేమిద్దరం దూరంగా ఉంటున్నామంటూ చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ప్రియతమ్ తన ఇద్దరు కొడుకుల ఫొటోస్ ను చూస్తూ కంటతడి పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతుంది. ప్రేమ అనేది నాకు మరియు నా కొడుకులకి మధ్య ఒక వందనలాగా దూరం చేస్తుంది. వారిని చేరుకునేందుకు కొన్ని వందల ఏళ్ళు అయినా నేను ప్రయాణిస్తూ ఉంటా. దూరం అనేది బంధాలను విడదీయలేదు.. ఐ లవ్ యు మై కిడ్స్.. అంటూ తన కొడుకులతో ఉన్న ఫొటోస్ ను చూస్తూ కాంటతడి పెట్టుకున్నాడు ప్రియతమ్.
ఇక ఇదిలా ఉంటే వీరిద్దరూ విడిపోవడానికి కారణం ప్రియతమ్ మరొక అమ్మాయిని ప్రేమించడమే అయినట్లు తెలుస్తుంది. తను సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో ఓ అమ్మాయిని ప్రేమించడంతో ఆ విషయం తెలుసుకున్న మానస తనని విడిచి మరొకచోట కి వెళ్ళిపోయిందట. వీరిద్దరి మధ్య ఉన్న లవ్ ప్రేమ విడాకులు వరకు తీసుకువెళ్ల లేక పోయింది. అందువల్లే వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు సమాచారం. మరి వీటిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్తను చూసిన పలువురు.. అసలు ప్రేమంటే ఇది కదా. తప్పు చేయడం గొప్ప కాదు దానిని క్షమించే వాళ్ళు ఉండడం గొప్ప.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.