ఉపగ్రహాలను సైతం కూల్చగల మిషన్ శక్తిని డీఆర్ డీఓ, భారత ప్రభుత్వం బుధవారం విజయవంతంగా ప్రయోగించాయి. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలండ్ లాంచ్ కాంప్లెక్స్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. దీనిపై ప్రధాని మోదీ ప్రకటన చేసిన కొద్దిసేపటికే.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కూడా.. ప్రయోగం విజయవంతం అయ్యిందని, లక్ష్యాలన్నీ నెరవేరాయని నిర్ధారించింది.
#MissionShakti is special for 2 reasons:
(1) India is only the 4th country to acquire such a specialised & modern capability.
(2) Entire effort is indigenous.
India stands tall as a space power!
It will make India stronger, even more secure and will further peace and harmony.— Narendra Modi (@narendramodi) March 27, 2019
ఏం చేస్తుంది..
డీఆర్ డీఓ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన మిషన్ శక్తి.. అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలను కూడా ఛేదించగలదు. ఇప్పటివరకు ఇలాంటి సామర్ధ్యం కేవలం అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే ఉండగా, ఇప్పుడు భారత్ కూడా సగర్వంగా వాటి సరసన చేరింది. ఇందులో ప్రధానంగా డీఆర్ డీఓకు చెందిన బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (బీఎండీ) ఇంటర్ సెప్టార్ ను ఉపయోగించారు. ఇదంతా ఆ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ కార్యక్రమంలో భాగమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. నిపుణుల అంచనా ప్రకారం, 2019 జనవరి 25న ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్ వీ సి44 మిషన్ లో భాగంగా పంపిన మైక్రోశాట్-ఆర్ అనే ఉపగ్రహాన్ని భారత్ కూల్చింది.
I agree with @DutchSpace: the most likely target of India's #ASAT test was Microsat-r (2019-006A). My analysis shows the test must have happened near 5:40 UT when the sat was moving northwards towards Abdul Kalam:@SSC_NL @nktpnd @planet4589 pic.twitter.com/HPUbQ6yTaU
— Dr Marco Langbroek ? #Vaccinate (@Marco_Langbroek) March 27, 2019
ఈ మిషన్ లో ఉన్న మిసైల్, యాంటీ మిసైల్ టెక్నాలజీ పూర్తిగా స్వదేశంలోనే తయారైంది. ఇదంతా దిగువ వాతావరణంలోనే చేశామని, దానివల్ల అంతరిక్షంలో వ్యర్థాలు నిలిచిపోవడం అనే సమస్య ఉండదని అధికారిక ప్రకటనలో తెలిపారు. ఉపగ్రహం ధ్వంసం కావడం వల్ల ఏర్పడిన వ్యర్థాలన్నీ కొన్ని వారాల్లోనే భూమ్మీద పడిపోతాయని అధికారిక ప్రకటనలో తెలిపారు. అయితే, ఎ-శాట్ పరీక్ష భూమి దిగువ కక్ష్యలో ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఇప్పటివరకు అంతరిక్ష వ్యర్థాలు, ప్రమాదాలు జరిగినట్లు ఎక్కడా రిపోర్టు కాలేదు. రాబోయే రోజుల్లో ఉపగ్రహం ఎన్ని ముక్కలైందన్న విషయాన్ని అమెరికా ఉపగ్రహ ట్రాకింగ్ నెట్ వర్క్ చెబుతుంది. సాధారణంగా కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలను కూలిస్తే వందలాదిగా చిన్న, పెద్ద ముక్కలు ఏర్పడతాయి. అవి కొన్నేళ్ల పాటు అంతరిక్షంలో ఉండిపోతాయి. 2007లో చైనా కూడా ఇలాంటి ప్రయోగమే చేసింది. దానివల్ల 3వేల చిన్న వస్తువులు దాదాపు దశాబ్దం పాటు అంతరిక్షంలో ఉండిపోయాయి.
యాంటీ మిసైల్ ప్రభావం ఎంతనేది ఇంకా స్పష్టంగా తెలియడంలేదు. ఈ పరీక్ష వల్ల రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయో ముందే చూసుకున్నారా లేదా అని కొందరు నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కొన్ని వారాలు, నెలల్లో ప్రవాహం మరింత విస్తృతం అవుతుందని శాటిలైట్ ట్రాకర్ మార్కో లాంగ్ బ్రోక్ చెప్పారు. ఆయన డచ్ ఎయిర్ ఫోర్స్ స్పేస్ సెక్యూరిటీ డివిజన్ కన్సల్టెంటుగా పనిచేస్తున్నారు.
అంతరిక్ష ఆయుధ రేసులో భారత్?
ప్రస్తుతానికి భారతదేశానికి అంతరిక్ష ఆయుధ రేసులో ప్రవేశించే ఉద్దేశం లేదని ప్రభుత్వ ప్రకటనలో ఉంది. అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకే వాడాలని తాము చెబుతున్నామని, దాన్ని ఆయుధాల మయం చేయడానికి వ్యతిరేకమని అన్నారు. అంతరిక్షంలో ఉన్న ఆస్తుల భద్రత కాపాడేందుకు జరిగే అంతర్జాతీయ ప్రయత్నాలకు మద్దతు ఇస్తామన్నారు. అంతరిక్షానికి సంబంధించి 1967 అక్టోబరు నెలలో ఔటర్ స్పేస్ ట్రీటీ ఒకటి కుదిరింది. దానిపై అప్పుడే భారతదేశం కూడా సంతకం చేసింది. కానీ పార్లమెంటు మాత్రం 15 ఏళ్ల తర్వాత 1982లో దాన్ని ఆమోదించింది. దాన్ని ఇప్పటికీ భారతదేశం ఉల్లంఘించలేదనే అంటున్నారు. అయినా మిషన్ శక్తి మాత్రం అంతరిక్షంలో భారత సామర్థ్యాన్ని చాటిచెప్పిందనే చెప్పక తప్పదు.