(విశాఖ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
వివాదాస్పద సంఘటనలకు సింహాచలం దేవస్థానం కేంద్ర బిందువుగా మారుతున్నది. చైర్ పర్సన్ గా సంచాయిత గజపతి రాజు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆలయానికి సంబందించి వరుసగా వివాదాస్పద ఘటనలు వెలుగు చూడటం ఆలయ ప్రతిష్ట లు దెబ్బతీసే విధంగా ఉంటున్నాయి.
సింహాచలం స్వామివారి బంగారం విక్రయం పేరుతో కోటి 40 లక్షలు బురిడీ కొట్టించిన మహిళ వ్యవహారం దర్యాప్తు జరుగుతున్న తరుణంలోనే మరో వ్యవహారం వెలుగులోకి రావడం కలకలాన్ని సృష్టిస్తుంది అన్నప్రసాద విరాళాలను అవకతవకలు జరిగాయని దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ దృష్టికి ఫిర్యాదు వెళ్ళింది. ఆంధ్ర బ్యాంకు తరఫున అన్నప్రసాద విభాగంలో పని చేస్తున్న శ్రీను అనే ఉద్యోగిని ఈ వ్యవహారంలో సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ విచారించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో శీను అనే వ్యక్తిని తాత్కాలికంగా విధుల నుండి తప్పించినట్లు ఆలయ ఏఈవో వీ త్రినాధ రావు తెలిపారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం లోపాలు వెలుగులోకి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
మరోపక్క బంగారం కొనుగోలు వ్యవహారంలో మోసపోయిన నెల్లూరు జిల్లాకు చెందిన బాధితురాలు పోలీసుల కు ఫిర్యాదు చేసింది. బంగారం విక్రయ వివాదానికి కీలక సూత్ర దారి అయిన హైమావతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సూళ్లూరుపేట కు చెందిన శ్రావణి దంపతులు సదరు కిలాడి మహిళకు బంగారం కోసం తొలి విడతగా 40 లక్షల రూపాయలు ఆన్ లైన్ ద్వారా చెల్లించారు. తర్వాత కొద్ది రోజులకు నేరుగా కోటి నాలుగు లక్షలు అందజేశారు. సింహాచలం ఆలయ స్వామి వారి కి చెందిన మూడున్నర కిలోల బంగారం ఇప్పించే ఒప్పందంపై హైమావతి అనే మహిళకు రెండు విడతలుగా వీరు కోటి 44 లక్షలు చెల్లించినట్లు బాధితురాలు శ్రావణి దంపతులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారాలపై ఒ పక్క దేవాదాయ శాఖ అధికారులు, మరో పక్క పోలీసులు విచారణ చేస్తున్నారు.