GAGAN: టెక్నాలజీ పరంగా ఇండియా రోజు రోజుకి ముందడుగు వేస్తూ ఉంది. శాస్త్ర సాంకేతిక రంగంలో పురోగతి సాధిస్తూ ఎన్నో మైలురాళ్లు అందుకుంటున్న భారత్ తాజాగా ఉపగ్రహాల సహాయంతో విమానం ల్యాండింగ్ ట్రైల్ రన్ విజయవంతంగా పూర్తి చేసింది. శాటిలైట్ నావిగేషన్ అనే కొత్త టెక్నాలజీ ద్వారా… విమానాలు ల్యాండింగ్ విషయంలో ఆసియా-పసిఫిక్ ఖండంలో.. భారత్ మొదటి దేశంగా నిలిచింది. రాజస్థాన్ లోని అజ్మీర్ విమానాశ్రయంలో ఉపగ్రహ ఆధారిత ల్యాండింగ్ సురక్షితంగా పూర్తి చేసి ఇండియా సరికొత్త మైలురాయిని అందుకుంది. ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరిణామంతో ఇక నుండి విమానాలు ల్యాండింగ్ కి సంబంధించిన “గగన్” పేరిట సొంత శాటిలైట్ నావిగేషన్ భారత్ అభివృద్ధి చేయడానికి నడుంబిగించింది.ప్రస్తుతం విమానాలు ల్యాండింగ్ కి సంబంధించి గ్రౌండ్ బేసిక్ సిస్టమ్స్ ద్వారా రన్ అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో శాటిలైట్ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ గగన్ (జిపిఎస్ బేస్డ్ ఆగ్యేంటేడ్ నావిగేషన్ GAGAN) ద్వారా ప్రయోగించిన విమానంలో పైలెట్లకు ల్యాండింగ్ కోసం దాదాపు అయిదు వందల మీటర్ల వరకు కనిపించేలా సంకేతాలు..పంపారు. గ్రౌండ్ బేస్డ్ ల్యాండింగ్ సిస్టం తరహాలోనే.. కచ్చితత్వాన్ని అందిస్తుంది. ఈ పరిణామంతో భవిష్యత్తులో శాటిలైట్ టెక్నాలజీతో విమానాలు ల్యాండింగ్ కార్యకలాపాలు జరుగుతాయని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టంచేసింది. శాట్నప్ టెక్నాలజీ ద్వారా ప్రయోగాత్మక విమానాన్ని ఢిల్లీ నుండి రాజస్థాన్ అజ్మీర్ ప్రయాణంలో కెప్టెన్ సందీప్ సూద్, కెప్టెన్ సతీశ్ వీరా, కెప్టెన్ శ్వేతా సింగ్ నడిపారు. వారితో పాటు ఇతర సాంకేతిక నిపుణులు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ (డీజీసీఏ) ఉన్నతాధికారులు విమానంలో ప్రయాణించారు. ఈ శాటిలైట్ గగన్ టెక్నాలజీ ద్వారా విమాన భద్రత ముఖ్యంగా ప్రతికూల వాతావరణంలో సురక్షిత ల్యాండింగ్ కి అనుకూలంగా ఉంటుంది అని ఇండిగో ఓ ప్రకటనలో తెలియజేసింది. ప్రపంచంలో ఇటువంటి నావిగేషన్ వ్యవస్థలు అమెరికా, యూరప్, జపాన్ వంటి చోట్ల.. ఉన్నాయి. దీంతో జిపిఎస్ సాయంతో విమానం ల్యాండింగ్ ట్రైల్ రన్ విజయవంతం కావటంతో త్వరలో ఇండియాలో కూడా అందుబాటులోకి రానున్న క్రమంలో ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా, గో ఫస్ట్,ఎయిర్ ఏషియా వంటి సంస్థలకు చెందిన విమానాల్లో గగన్ వ్యవస్థను.. అమరుస్తున్నారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మరియు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా కలిసి.. ఈ నావిగేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది.