Akshay Kumar: బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అక్షయ్ కుమార్. ముగ్గురు ఖాన్ ల సినిమాలకి మంచి పోటీ ఇచ్చే హీరో. అన్ని రకాల సినిమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అక్షయ్ కుమార్…యాడ్ రంగంలో కూడా తిరుగులేని రికార్డు ఉంది. చాలా ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ వచ్చారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ప్రముఖ పొగాకు కంపెనీకి చెందిన గుట్కా యాడ్ చేయడం జరిగింది. ఈ యాడ్ లో అక్షయ్ కుమార్ తో పాటు అజయ్ దేవగన్, షారుక్ ఖాన్ కూడా నటించారు. ఈ క్రమంలో ఈ యాడ్ కి సంబంధించి అజయ్ దేవగన్, షారుక్ ఖాన్ లపై రాణి విమర్శలు అక్షయ్ కుమార్ పై రావడం సంచలనంగా మారింది. కారణం చూస్తే 2018 సంవత్సరంలో ఓ మీడియా సమావేశంలో అక్షయ్ మాట్లాడుతూ.. పొగాకు కంపెనీలకు సంబంధించిన వాళ్లు తన దగ్గరకు యాడ్ చేయాలని.. ప్రొడక్ట్ నీ ప్రమోట్ చేయాలని వచ్చారు.. భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. కానీ తిరస్కరించా.. అని మీడియా సమక్షంలో అప్పట్లో తెలియజేశారు. స్వచ్ఛభారత్ అనే ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించిన వీడియో సమావేశంలో అక్షయ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం మాత్రమే కాదు… గుట్కా యాడ్ చేసే హీరోలను అనుకరించ కూడదు అని కూడా తెలిపారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కాగా గుట్కా..యాడ్ లని వ్యతిరేకిస్తూ గొప్పగా అప్పట్లో చెప్పినా అక్షయ్ కుమార్ నాలుగు సంవత్సరాల లోనే ప్రముఖ పొగాకు కంపెనీ “విమల్ ఎలైచి” తో చేతులు కలిపి ఇప్పుడు గూట్కా యాడ్ చేయటంతో సోషల్ మీడియాలో నెటిజన్ ల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. పైగా పొగాకు కంపెనీలను ప్రమోట్ చేసే హీరోలుగా ముద్ర ఉన్న వారితోనే యాడ్ చేయటంతో అక్షయ్ కుమార్ సొంత అభిమానుల నుండి కూడా వ్యతిరేకత వచ్చింది. సోషల్ మీడియాలో గత కొద్దీ రోజుల నుండి భారీ ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో తాజాగా బయట నుండి వస్తున్న ఒత్తిడికి వ్యతిరేకత.. దెబ్బకు అక్షయ్ కుమార్ అభిమానులకు, శ్రేయోభిలాషులకు క్షమాపణలు చెబుతూ.. లెటర్ రిలీజ్ చేశాడు.
దయచేసి నన్ను క్షమించండి. ముఖ్యంగా నా అభిమానులు మరియు శ్రేయోభిలాషులకు క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నాను. పొగాకు కంపెనీ కి సంబంధించిన యాడ్ విషయంలో గత కొన్ని రోజులుగా మీ నుండి నాపై వస్తున్న స్పందన తీవ్రంగా కలచివేసింది. అయితే ఇక్కడ నేను టొబాకో ప్రోడక్ట్ నీ సపోర్ట్ చేయటం లేదు. కేవలం యాడ్ వల్ల వచ్చిన డబ్బుతో ఒక విలువైన కారణానికి ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నా. కానీ వస్తున్న వ్యతిరేకత బట్టి విమల్ ఏలైచి తో ఉన్న ఒప్పందం చట్టపరంగా.. కాంట్రాక్ట్ పరంగా కొనసాగించాలి. కానీ భవిష్యత్తులో మాత్రం.. ఇటువంటి విషయాలలో ఎంపిక చేయటంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అని మీ అందరికీ మాట ఇస్తున్నాను.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదే సమయంలో.. గతంలో చూపిన ప్రేమ మరియు అభిమానం మళ్లీ చూపాలని కోరుతున్నాను. చాలా వినయంతో అభ్యర్దిస్తున్నాను. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి అంటూ అక్షయ్ కుమార్ క్షమాపణలు చెబుతూ అభిమానులకు లెటర్ రాయడం జరిగింది. దీంతో ఈ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం విమల్ ఏలైచీ కంపెనీతో ఒప్పందం ప్రకారం.. యాడ్ ప్రసారమవుతుంది. అయితే ఇందుకుగాను వచ్చిన రెమ్యూనరేషన్ ఒక విలువైన కారణానికి అందించాలని నిర్ణయించుకున్నట్లు అక్షయ్ కుమార్ తెలియజేయడంతో.. సోషల్ మీడియాలో కొద్దిగా వాతావరణం చల్లబడింది.