Beauty Tips: అందరిలోనూ ప్రకాశవంతంగా కనిపించే ముఖం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.. అయితే మన యాంత్రిక జీవితంలో మన ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా చర్మం నిగారింపును కోల్పోతుంది.. బయటికి వెళ్లే వారిలో కాలుష్యం కారణంగా చర్మం పై మృతకణాలు పేరుకుపోతున్నాయి.. మార్కెట్లో లభించే బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే మన ఇంట్లో లభించే వస్తువులతోనే మృతకణాలను ఎలా తొలగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!
మృత కణాలను తొలగించి ముఖాన్ని కాంతివంతం చేయడంలో బియ్యప్పిండి ముందుంటుంది. ఒక స్పూన్ బియ్యప్పిండిలో ఒక స్పూన్ తేనె కలపాలి. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని ఆ తర్వాత ఇప్పుడు చెప్పుకున్న ప్యాక్ ని ముఖానికి అప్లై చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ముఖం పై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మృతకణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
నిమ్మరసం ముఖంపై పేరుకుపోయిన మురికిని అద్భుతంగా తొలగిస్తుంది. ఒక స్పూన్ నిమ్మ రసంలో అర స్పూన్ బేకింగ్ సోడా అర స్పూన్ తేనె కలపాలి. ముఖానికి రాసుకుని రెండు నిమిషాల పాటు స్క్రబ్ చేయాలి. ముందు గోరు వెచ్చని నీటితో కడిగి ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే ముఖం పై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. మోము మెరుస్తుంది. ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, తేనె, బ్రౌన్ షుగర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని రెండు నిమిషాలు మసాజ్ చేయాలి. ముందు గోరు వెచ్చని నీటితో కడిగి ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే ముఖం పై ఉన్న మృతకణాలు తొలగిపోయి కాంతివంతంగా తయారవుతుంది. మెరుగైన ఫలితాలు కనిపించాలంటే వారానికి రెండు సార్లు ఈ చిట్కాలు పాటించండి.