గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కాజల్ పెళ్లి గురించి ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే కాజల్ దీనికి స్పందిస్తూ తను నిజంగానే గౌతం అనే వ్యక్తిని పెళ్లిచేసుకోబోతున్నానని అక్టోబర్ 31న ఈ వివాహం ముంబైలో జరగనుందని క్లారిటీ ఇచ్చేశారు. దీంతోకాజల్ పెళ్లి వార్త వినగానే తన అభిమానులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు.
ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ ఇద్దరూ జంటగా కవచం, సీత వంటి సినిమాలలో నటించారు. అయితే ఈ సినిమాలు అభిమానులకు పెద్దగా కనెక్ట్ కాకపోయినా, వీరిద్దరి మధ్య రిలేషన్ బాగా కనెక్ట్ అయింది. సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ఎంతో సరదాగా ఉంటారు. ఇద్దరూ కలిసి టిక్ టాక్ వీడియోలు కూడా చేశారు. అలా వీరిద్దరూ అందరి కళ్ళల్లో పడ్డారు.
లాక్డౌన్ సమయంలో వీరిద్దరి మధ్య జరిగిన ఓ సంభాషణలో నిన్ను చూడాలని ఉంది. చాలా మిస్ అవుతున్నా అంటూ కాజల్ ఓ పోస్ట్ చేయడంతో, అందుకు బెల్లంకొండ మిస్ యు టూ అని రిప్లై ఇవ్వడం వైరల్ గా మారింది. ఈ సంభాషణతో వీరిద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడిందనే రూమర్లు కూడా వచ్చాయి.
కాజల్ అగర్వాల్ పెళ్లి వార్త వినగానే బెల్లంకొండ శ్రీనివాస్ తనదైన శైలిలో ప్రతి స్పందించాడు. వీరిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా, అంతేకాకుండా కాజల్ చేసుకోబోయే గౌతమ్ ఎప్పటినుంచో పరిచయం ఉన్న వ్యక్తి లా అతనిని జీ కే బ్రో అంటూ సంబోధించి మాట్లాడాడు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ గడ్డం పెంచిన ఫోటో వైరల్ కావడంతో కాజల్ పెళ్లి అని దేవదాసు లా మారిన బెల్లంకొండ అబ్బాయి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాజల్ మోసం చేసిందా? ఏం పర్లేదు లైట్ తీసుకో అంటే సదరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!