Rajamouli: “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” అని అందరికీ తెలుసు. “బాహుబలి” కి స్టోరీ అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కూడా స్టోరీ అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయేంద్రప్రసాద్ ఆర్ఆర్ఆర్ గురించి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 27 ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ కమెడియన్ ఆలీ షోలో పాల్గొని అనేక విషయాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆలీ.. జనరల్ గా చాలా మంది రైటర్స్ స్టోరీలు రాయటానికి ఇతర దేశాలకు వెళ్లి పోతారు. కానీ మీరు అందించే సినిమాలు అనేక రికార్డులు సృష్టిస్తున్నాయి. మీరు ఎక్కడ సినిమా స్టోరీలు రాస్తారు అని ఆలీ ఆసక్తిగా అడగటం జరిగింది. దానికి విజయేంద్రప్రసాద్ సమాధానం చెబుతూ.. నేను ఇప్పటివరకు వేరే దేశం లోకి వెళ్లి.. ఎక్కడా కూడా స్టోరీలు రాయలేదు. ఉన్న ఇంటిలోనే నాలుగు గోడల మధ్య స్టోరీలు రాయటం జరిగిందని చెప్పుకొచ్చాడు.
Read More: RRR Special Video: అభిమానులకు ఆర్ఆర్ఆర్ టీమ్ స్పెషల్ వీడియో..
ఇదే సందర్భంలో “RRR” సినిమాలో హైలెట్ ఆలియా భట్ క్యారెక్టర్ అని తెలిపారు. అంతే కాకుండా రామ్ చరణ్ ఎన్టీఆర్ పోరాట సన్నివేశాలు తాను చూసినప్పుడు కంటిలో నుండి నీళ్లు వచ్చాయి అని, అంతగా స్టోరీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది అంటూ “ఆర్ఆర్ఆర్” గురించి విజయేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా అనేక విషయాల గురించి విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో విజయేంద్ర ప్రసాద్ కొడుకు రాజమౌళి అనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అనే స్థానం వచ్చింది గర్వంగా ఉంది అన్నట్లు ఆలీ తో కొడుకు రాజమౌళి కెరీర్ గురించి సంతోషించారు.