Eye Problems: ఈ రోజుల్లో ఎక్కువ మందిలో దృష్టిలోపం సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని వింటున్నాం.. దీనికితోడు ఇతర కంటి సమస్యలు గురవుతున్నారు.. ఈ విషయం పై లండన్ యూనివర్సిటీ పరిశోధకులు పరిశోధనలు నిర్వహించరు.. తాజా అధ్యయనాల లో ఆశ్చర్యకరమైన ఈ విషయాన్ని కనుగొన్నారు సైంటిస్టులు..!!
ఉదయాన్నే ఎర్రటి సూర్య కాంతిని తదేకంగా మూడు నిమిషాలు పాటు చూడటం వలన రెటీనా లోని మైటోకాండ్రియల్ కణాలు శక్తిని పుంజుకుని చురుగ్గా మారుతున్నట్లు వాళ్ల పరిశోధనలో తేలింది. మన వయసు పెరుగుతున్న కొద్దీ కణాల్లో ఉండే మైటోకాండ్రియా శక్తి తగ్గి వృద్ధాప్యాన్ని సంతరించుకుంటాయి. దాంతో అవి శక్తిని సరిగ్గా ఉత్పత్తి చేయలేక పోతాయి. ఫలితంగా కణాల పనితీరు తగ్గుతుంది. అంతేకాకుండా రెటీనా కణాల్లో మైట్రోకాండ్రియాలా శాతం తగ్గుతుంది. దాంతో అవి సరిగా శక్తిని ఉత్పత్తి చేయలేవు. మిగతా శరీర భాగాలతో పోలిస్తే కళ్ళు త్వరగా వృద్ధాప్యాన్ని సంతరించుకుంటాయి.
అందుకని ఎల్ఈడీ తో పనిచేసే పరారుణ కాంతి కి గురి చేసినప్పుడు మైటోకాండ్రియా చురుకయ్యి శక్తి ఉత్పత్తి చేస్తుందని దాని వలన రెటీనా పనితీరు మెరుగు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం, సాయంత్రం తో పోలిస్తే ఉదయం ఎరుపు కాంతి ప్రభావం ఆ కణాల మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నట్టు వారి పరిశోధనలో తేలింది. అందుకే మన పెద్దవారు సూర్యనమస్కారాలు చేయమని చెబుతుంటారు. ఉదయం సూర్య నమస్కారాలు చేస్తే కంటి చూపు కూడా పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది.