Ukraine Russia War: ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అందరికీ సుపరిచితులే. ఇటీవలే గణతంత్ర దినోత్సవం నాడు కేంద్ర ప్రభుత్వం గరికపాటికి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం తెలిసిందే. ఎప్పుడు ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలిచే గరికపాటి నరసింహారావు తాజాగా ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న ఉక్రెయిన్- రష్యా యుద్ధం పై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. మహాశివరాత్రి సందర్భంగా వరంగల్ జిల్లాలో ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న గరికపాటి నరసింహారావు.. యుద్ధం పై తనదైన శైలిలో కామెంట్లు చేశారు.
ప్రస్తుతం దేశంలో రాష్ట్రాలలో పరిస్థితి ఎలా ఉన్నా గాని.. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో.. రష్యా అధ్యక్షుడు పుతిన్ అణు పరీక్షలు ఉపయోగించకూడదని.. ఆ భగవంతుడు పుతిన్ మనస్సులోకి వెళ్లి.. అతని ఆలోచన మార్చాలని అందరూ ప్రార్థించాలని.. ఈ కార్యక్రమంలో భక్తులకు గరికపాటి నరసింహారావు సూచించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చను ఒకపక్క విఫలం అవుతుంటే మరోపక్క.. యూరోపియన్ కంట్రీస్ ఉక్రెయిన్ కి మద్దతు తెలపడానికి ముందుకు వస్తున్న తరుణంలో పుతిన్ అణు యుద్ధమే కరెక్ట్ అన్న ఆలోచనలో ఉన్నట్లు ఇంటర్నేషనల్ మీడియా వార్తలు ప్రచారం చేస్తోంది.
నాటో సభ్యత్వం దాదాపు ఉక్రెయిన్ కి లభించే పరిస్థితి ఉన్న తరుణంలో పుతిన్.. యుద్ధమే శరణ్య మొన్న తరహాలో ఉక్రెయిన్ పై బాంబులతో దాడులకు పాల్పడుతున్నారు. ఉక్రెయిన్ రాజధాని లో ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు చేస్తున్న దాడులు… ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో చాలామంది బంకర్ లోకి వెళ్ళిపోయి తమ ప్రాణాలను కాపాడుకుంటున్నారు.