IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లో అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ రికార్డుతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డుకు చెక్ పెట్టాడు.. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ 32 పరుగులు తీసిన సంగతి తెలిసిందే.. ఆ పరుగులలో 2 సిక్సర్లు కొట్టాడు.. దీంతో ఐపీఎల్ లో రోహిత్ శర్మ మొత్తం సిక్సర్ల సంఖ్య 217 కు చేరింది..!! ఇప్పటివరకు ఐపీఎల్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ ప్లేయర్ గా ధోని (216) పేరు మీద ఉన్న రికార్డును రోహిత్ తిరగరాశాడు..!!
ఓవరాల్ గా ఐపీఎల్ లో అత్యధిక సిక్స్ లు కొట్టింది క్రిస్ గేల్ 351, ఏబి డివిలియర్స్ 237 , ఆ తర్వాత స్థానంలో రోహిత్, ధోని తర్వాత విరాట్ కోహ్లీ 201 గా ఉన్నాడు.. టీ20 లో 4 వేల పరుగుల రికార్డును కూడా ఇదే మ్యాచ్ తో రోహిత్ సొంతం చేసుకున్నాడు..