ఇన్ని రోజులనుంచి వేచి చూసిన ఆ శుభ తరుణం పూర్తికానే అయింది. మన మిత్రవింద కాజల్ పెండ్లి తంతు ముగిసింది. ఈ అందాల భామ గౌతమ్ కిచ్లూ తో ఏడడుగులు వేసి ఓ ఇంటి శ్రీమతి అయ్యింది. శుక్రవారం బిజినేస్ మ్యాన్ అయిన గౌతమ్ కిచ్లూని ఘనంగా మనువాడిన సంగతి తెలిసిందే. కరోనా కష్టకాలాన్ని ధృష్టిలో ఉంచుకుని అతి తక్కువ మంది సమక్షంలో ముంబయిలోని తాజ్ హోటల్ లో ఘనంగా వివాహ మహోత్సవం జరిగింది. ఇదిలా ఉండగా మన ముద్దుగుమ్మ కాజల్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ చందమామ ధరించిన లెహంగా అందరినీ కట్టిపడేసింది. ఆ లెహంగాను ఎంతో ఫేమస్ అయిన డిజైనర్ అనామికా ఖన్నా తయారుచేశారట. ఆ లెహంగాను అనామికా ఎంతో ప్రేమతో తయారు చేశానని ఆమె చెప్పుకొచ్చారు. ఫ్లోరల్ డిజైన్ లో ఉన్న ఆ లెహంగాకు జర్దోసీ వర్క్ చేయడానికి 20 మందితో రెండు రోజులపాటు వర్క్ చేసి కంప్లీట్ చేశామని డిజైనర్ తెలిపారు. దీనితో కాజల్ లెహంగాలో రాజసం ఉట్టిపడేలా కనువిందు చేసింది.
దీనితో పాటుగా ఆమె ధరించిన ఆభరణాలు ఆమె అందానికి మరింత కొత్త హంగులు తెచ్చిపెట్టాయి. ఇక వరుడు గౌతమ్ కిచ్లూ కూడా తెలుపు రంగు షేర్వాణీలో మెరిసిపోయారు. వీరి జంట చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలాగే మొహంది ఫంక్షన్ లో చందమామ ధరించిన ఆకుపచ్చ కుర్తాలో మరింద ముద్దొచ్చారు.
కరోనా వైరస్ కారణంగా అతి తక్కువ మంది సమక్షంలో మా పెళ్లి జరిగిందని కాజల్ శనివారం చెప్పుకొచ్చారు. అలాగే కోవిడ్ నిబంధనలను కూడా కఠినంగానే అమలు చేసి పాటించామని ఆమె తెలిపారు. అలాగే వివాహానికి హాజరైన వారందరికీ కరోనా పరీక్షలు చేయించినట్టు కాజల్ చెప్పారు. వివాహ తంతుకు హాజరైన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలుపుతూ మిసెస్ గౌతమ్ కిచ్లూ పోస్ట్ చేశారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!