Pavan Kalyan : దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాలుస్తోంది.. పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.. దీంతో పవన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.. తాజాగా పవన్ కళ్యాణ్ ‘నా ఆరోగ్యం కుదుట పడుతుంది.. ఆందోళన చెందవద్దు.. పవన్ కళ్యాణ్ భావోద్వేగం చెందారు..
‘ ప్రస్తుతం నా ఆరోగ్యం కుదుటపడుతోంది.. వైద్యులు సూచనలు, సలహాలు పాటిస్తున్నాను.. వీలైనంత త్వరగా కోలుకొని మీ ముందుకు వస్తాను.. నేను కరోనా బారిన పడ్డానని తెలిసినప్పటినుంచి నా యోగక్షేమాల గురించి ఆందోళన చెందుతూ.. సంపూర్ణ ఆరోగ్యవంతుని కావాలని ప్రతి ఒక్కరు ఆశించారు. రాజకీయ, సినీ, సామాజిక ప్రముఖులు, మీడియా ప్రతినిధులు నేను క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు..
సందేశాలు పంపించారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జనసేన పార్టీ నేతలు, జన సైనికులు అభిమానులు నేను ఆరోగ్యంగా ఉండాలని ఆలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, యాగాలు చేసిన విషయం నా దృష్టికి వచ్చింది. మీ గుండెల్లో నాకు స్థానం ఇచ్చారు. కృతజ్ఞతలు, ధన్యవాదాలు.. లాంటి పదాలతో నా భావోద్వేగాన్ని తెలుపలేను.. ఎప్పటికీ మీరంతా నా మీ కుటుంబ సభ్యులే.. సంపూర్ణ ఆరోగ్యం మీ ముందుకు వచ్చి.. మీతో పాటు ప్రజల కోసం నిలబడతాను.. అన్నారు పవన్ కళ్యాణ్..
ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడటం దురదృష్టకరం ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు.రామ్ చరణ్, ఉపాసన లు ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.