Petrol bomb : రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న “హీరో” సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది.. స్క్రిప్టు ప్రకారం షూటింగ్ లో ఫైటింగ్ సీన్స్ షూట్ చేస్తున్నారు.. అందులో భాగంగా హీరో రిషబ్ తో పాటు మరో నటుడు లక్ష్మణ్ పెట్రో బాంబులు సన్నివేశాలను షూట్ చేయాలి.. కానీ ఈ సీన్ లో వారి పరిగెత్తే లోపే పెట్రో బాంబులు పేలాయి.. దీంతో షూటింగ్ లో హీరో రిషబ్ తో పాటు మరో నటుడికి గాయాలయ్యాయి.. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
కర్ణాటక పోలీసులు సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ కు ఎవరూ పర్మిషన్స్ ఇచ్చారనే విషయమై వివరాలు వాకబు చేస్తున్నారు.. మొత్తంగా ఈ పెట్రో బాంబు ఘటన కన్నడ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. కన్నడ ఇండస్ట్రీ లో హీరో రిషబ్ శెట్టి కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. పలు విజయవంతమైన లో చిత్రాల్లో నటించిన శాండిల్ వుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.. ప్రస్తుతం 6 పైగా మూవీస్ చేస్తున్నాడు.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న హీరో చిత్రం షూటింగ్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ మూవీలో గణవి లక్ష్మణ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.