సరిగ్గా ఒకరోజు ముందే ప్రముఖ గాయని సునీతకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే తనకు కరోనా లక్షణాలు ఉండడంతో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో తాను వ్యాధి నుంచి బయట పడ్డాను అంటూ ఆమె ఒక వీడియో ని విడుదల చేసింది. కరోనా గురించి ఆందోళన అక్కర్లేదు అని…. చాలామంది అనవసరమైన భయాందోళనలకు గురి అవుతున్నారని చెప్పిన ఆమె తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తూ కాల్స్ మెసేజెస్ చేసిన వారందరికీ ఒక వీడీయో ద్వారా కృతజ్ఞతలు తెలిపింది.
ఇక తన గురించి తనకు ఎలాంటి ఆందోళన లేదు అని…. తన ఆందోళన అంతా ప్రస్తుతం చెన్నైలోని ఆసుపత్రిలో పరిస్థితి విషమించి ప్రాణాల కోసం పోరాడుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించే అని సునీత వీడియోలో చెప్పింది.
అయితే కరోనా వస్తే హాస్పిటల్ కి వెళ్లి రావాలి కానీ…. దీనికి కూడా ఇంత పబ్లిసిటీ అవసరమా….? అంటూ కొందరు ఆమెను హేళన చేయడం మొదలుపెట్టారు. తెలుగు పాటలు బాగానే పాడుతావు కదా… మరి వీడియో అంతా ఇంగ్లీష్ లో మాట్లాడడం ఫ్యాషన్ అనుకుంటున్నావా…? అని మరి కొందరు అనవసరమైన కామెంట్ లు చేశారు.
దీంతో ఆమె ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టారు. ఈసారి వీడియో పోస్ట్ చేయడం కాకుండా ఆమె టెక్స్ట్ రాసి పెట్టారు. కరోనా అవగాహన కోసం ఇంకా చాలా విషయాలు చెప్పాలి అనుకుంటున్నానని…. అయితే అవి చెబితే ఎలాంటి దూషణలు వినాల్సి వస్తుందో అనే ఉద్దేశంతో ఆ విషయాలను చెప్పకుండా విరమించుకున్నాను అని సునీత చెప్పారు.
సింగర్ సునీత చేసిన ఫేస్ బుక్ పోస్ట్ – “అందరికీ నమస్కారం. మొన్న నేను పెట్టిన వీడియో కి స్పందించి నా బాగోగులు కోరుకున్న నా అభిమానులందరికి కృతజ్ఞతలు ఈ వీడియో youtube చెక్కర్లు కొడుతోంది. మంచిది. నేను తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లో కూడా పాటలు పాడటం వలన అక్కడకూడా అభిమానులు నాతో మాట్లాడుతూ వుంటారు. అందరికీ ఒకేసారి విషయం తెలుస్తుందని ఎక్కువ ఆంగ్లంలో మాట్లాడటం జరిగింది. కానీ విషయం వదిలేసి సమాజం లో ఉన్న చాలా మంది న్యాయనిర్ణేతలు(కోర్టు లో ఉండేవారు కాదు).
ఇలా ఆమెను ను అనరాని మాటలు అన్న వారికి ఏమీ ఆనందం వచ్చిందో తెలియదు గాని సునీత మాత్రం చాలా బాధపడింది. ఇక ఆమెను అనవసరంగా హేళన చేసిన వారందరినీ వెధవలు కాకుండా ఇంకా ఏమి అనాలో ఎవరికి తోచడం లేదు.