ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు భవితవ్యం రేపు తేలిపోతుందట. టీడీపీ ఎమ్మెల్సీలు శివనాధరెడి ,పోతుల సునీత లు శాసనమండలిలో పార్టీ విప్పును ధిక్కరించి మరీ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు మద్దతుగా ఓటు వేయడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వారు పార్టీ విప్ను ధిక్కరించి నందున ఎమ్మెల్సీ పదవులు అనర్హులుగా ప్రకటించాలని టీడీపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ కు ఫిర్యాదు చేయడం విధితమే.గత నెల 3వ తేదీనే షరీఫ్ ఈ విషయమై తొలి విచారణ చేపట్టగా వారు గైర్హాజరయ్యారు.అనారోగ్య కారణాలు చూపి సునీత విచారణకు డుమ్మా కొట్టారు.దీంతో విచారణను షరీఫ్ నెల రోజుల పాటు వాయిదా వేయడం తెలిసిందే. ఆదివార౦ మలివిడత విచారణ జరగనున్నట్లు శివనాధరెడి, పోతుల సునీతకు షరీఫ్ నోటీసులు పంపారు. అయితే కరోనా నేపథ్యంలో వ్యక్తిగతంగా కాకుండా వాట్స్అప్ మెసేజ్ లద్వారా ఈ విచారణ జరగనున్నది.
కాగా విచారణ కు సిద్ధంగా ఉన్నానని తన లాయర్ ద్వారా అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేశామని పోతుల సునీత చెబుతున్నారు. పదవి పోయినా పట్టించుకోను కూడా ఆమె ఆమె మీడియాకు తెలిపారు. టిడిపి తనను అనేక విధాలుగా అవమానించిందని ఆమె ఆరోపించారు. అయితే చీరాల లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన సునీతకు టిడిపి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిని కూడా చేసింది. మరి టిడిపి లో సునీత కి జరిగిన అన్యాయం ఏమిటో ఆమెకే తెలియాలి అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.మండలి చైర్మన్ షరీఫ్ టిడిపి టీడీపీకి చెందిన వారు అయినందున ఈ ఎమ్మెల్సీల మీద అనర్హత వేటు పడుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అసలు ఇంతకీ వీరు రేపటి విచారణకు హాజరు అవుతారా లేదా అన్నది కూడా చూడాలి.