ప్రతీ ఏటా నిర్వహించే అతిపెద్ద టి20 క్రికెట్ టోర్నీ ఐపీఎల్ ఈ ఏడాది కరోనా వైరస్ ప్రభావం కారణంగా వాయిదా పడిన విషయం తెల్సిందే. ప్రతీ ఏడాదిలానే ఈసారి కూడా మొదట సమ్మర్ లోనే ఐపీఎల్ ను సమ్మర్ లో ప్లాన్ చేసారు.
అయితే కరోనా వైరస్ భారత్ లో వ్యాప్తి చెందడంతో ఈ క్రికెట్ టోర్నీ వాయిదా పడింది. అయితే బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ఈ ఏడాది కచ్చితంగా టోర్నీను నిర్వహించే తీరతామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ మాట్లాడుతూ ఈ ఏడాది టోర్నమెంట్ ను యూఏఈలో నిర్వహిస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ వివరాలు, మిగతా సమాచారం అధికారికంగా త్వరలో వెల్లడి కానుంది.