సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. మరో హీరోయిన్ గా నివేదా థామస్ పేరు పరిశీలిస్తున్నాడు సుకుమార్. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయిదు భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తుండటంతో పక్కా ఈ సినిమాతో అల్లు అర్జున్ కి పాన్ స్టార్ క్రేజ్ రావడం ఖాయమని ఫ్యాన్స్ తో పాటు, ప్రేక్షకులు ఫిక్సైయ్యారు.
దేవీశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని ఆల్బం సూపర్ హిట్టవ్వడానికి సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇక రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుకుమార్ అలాగే అల వైకుంఠపురములో సినిమాతో రికార్డ్స్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్ కాంబినేషన్ మీద ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది.
ఇక ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా ఎక్కువ శారం ఫారెస్ట్ లో చిత్రీకరించాల్సి ఉండగా త్వరలో నల్గొండ ప్రాంతంలో ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో క్లైమాక్స్ ప్రాణం అన్న టాక్ వినిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అందరిని షాక్ కి గురి చేస్తుందని సమాచారం. ఇక సుకుమార్ ఇప్పటి వరకు తీసిన సినిమాలలో క్లైమాక్స్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఉందన్న సంగతి తెలిసిందే. అయితే గత చిత్రాలకంటే పూర్తి వైవిధ్యంగా పుష్ప లో క్లైమాక్స్ ఉండబోతుందని అంటున్నారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!