ప్రస్తుతం భారతదేశం అన్ లాక్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే రెండు సార్లు అన్ లాక్ ను విధించిన భారత ప్రభుత్వం, ఆగష్టు 1 నుండి మూడో దశను అందుబాటులోకి తీసుకురానుంది. హోమ్ మినిస్ట్రీ విడుదల చేసిన అన్ లాక్ 3 గైడ్ లైన్స్ ఈ విధంగా ఉన్నాయి.
ఆగష్టు 1 నుండి ఇకపై నైట్ కర్ఫ్యూ ఉండదు. ఇన్నాళ్లూ రాత్రి 10 నుండి ఉదయం 5 వరకూ కర్ఫ్యూ ఉన్న విషయం తెల్సిందే. అలాగే జిమ్స్, యోగ క్లాసులు ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే స్వతంత్ర దినోత్సవాన్ని సామాజిక దూరం పాటిస్తూ చేసుకోవాల్సి ఉంది. ఆగష్టు 5 నుండి ఇవి అమల్లోకి రానున్నాయి. అయితే సినిమా హాళ్లు, స్కూళ్ళు, మెట్రో రైళ్లపై ఇంకా నిషేధం కొనసాగుతోంది.