అయోధ్య రామమందిర శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్ది గంటల్లో ప్రధాని మోడీ చేతుల మీదుగా జరగబోయే భూమి పూజకు రామజన్మభూమి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయోధ్య నగరంలో ఎటు చూసినా ఆలయాలు, పట్టపగలు కూడా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. అయోధ్యలో మొత్తం ఆధ్యాత్మిక శోభ నెలకొంది. రామమందిరం ఏర్పాటు కానున్న తరుణంలో, అయోధ్య దశ ఒక్కసారిగా మారిపోయింది. అయోధ్యకు కొత్త ఎయిర్ పోర్ట్ మరియు రైల్వే స్టేషన్ ఆధునీకరణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 500 కోట్ల రూపాయలతో రూపురేఖలు మార్చడానికి రెడీ అయ్యింది.
రామమందిర శంకుస్థాపన తర్వాత… అతి తక్కువ టైమ్ లోనే అయోధ్యలో అభివృద్ధి పట్టా లెక్కించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి దేశంలోనే అయోధ్య సాంస్కృతిక టూరిజానికి కేంద్ర బిందువు అన్నట్టుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక వ్యూహంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి సన్నద్ధమైంది. భారతీయ శిల్పకళ ఉట్టిపడేలా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆలయ నిర్మాణం నమూనా ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది.
ఇదిలా ఉండగా మూడో అంతస్తులో ఉండే రామాలయాన్ని గులాబీ రాతి స్తంభాలతో నిర్మించనున్నట్లు దానికోసం రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లా బన్సీ పహాద్పూర్ నుంచి 360 స్తంభాలను, పిల్లర్లు మరియు పింకు స్టోన్ లు తెప్పిస్తున్నారట. కాగా ఆలయం ఎత్తు ముందు అనుకున్న దానికంటే రెట్టింపు ఎత్తులో నిర్మించడానికి తాజాగా రెడీ అవుతున్నారట. ఎత్తయిన ఈ రామాలయాన్ని అద్భుతమైన ఇండియన్ ఆర్కిటెక్చర్ తో నిర్మించనున్నారట. దాదాపు 161 ఫీట్ల ఎత్తులో రామమందిరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి శ్రీ రామ జన్మభూమి లో ఆలయ నిర్మాణంతో అయోధ్య దశ దిశ మారిపోబోతున్నట్లు… అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ అయినట్లు అర్థమవుతుంది.