ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలు అందరినీ తన కామెంట్లతో ఉలిక్కిపడేలా చేశాడు. అసలు ఆంధ్రప్రదేశ్ కి ఈ కర్మ ఏమిటి..? దేశంలో ఏ రాష్ట్రానికి లేని దుస్థితి ఈ రాష్ట్రానికి మాత్రమే ఎందుకు పట్టుకుంది..? రాజధాని లేకుండా 13 జిల్లాల రాష్ట్రం కావడం ఏమిటి..? తాత్కాలిక నిర్మాణాలతో ‘అమరావతి’ రాజధాని కావడం ఇప్పుడు మళ్లీ విచిత్రంగా మూడు రాజధానుల వింత ఆలోచన తెరపైకి రావడం…. అసలు ఇవన్నీ కాదు మేము ఏకంగా జిల్లా కి ఒక రాజధాని ఏర్పాటు చేస్తామంటూ బిజెపి అధ్యక్షుడు తాజాగా చేసిన ప్రకటన ఇప్పుడు పెద్ద సంచలనం రేపుతోంది.
సోము వీర్రాజు మాట్లాడుతూ వైసిపి కి వచ్చిన 151 సీట్లలో 40 సీట్లను వచ్చే ఎన్నికల్లో బీజేపి వారు లాగేసుకుంటారట. టిడిపి నుంచి కూడా కొన్ని లాగేసుకొని మొత్తానికి 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాదని భవిష్యవాణి చెప్పారు. అప్పుడు చక్రం చెప్పి అధికారంలోకి వస్తామని సోము వీర్రాజు చెప్పిన లెక్క చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. టీడీపీ, వైసీపీ ని ఇలా తొక్కేసే బీజేపి… మన మిత్రపక్షం జనసేనను ఏం చేస్తుంది వారి పార్టీ పరిస్థితి ఏంటి..? అన్నది ఇప్పుడు ప్రశ్న.
అసలు ఏపీ లో భారతీయ జనతా పార్టీని నడిపించే సరైన నాయకత్వమే వారికి దొరకలేదు. సోము వీర్రాజు కన్నా కన్నా లక్ష్మీనారాయణ ఇటువంటి స్టేట్మెంట్లు విషయంలో చాలా బెటర్. ఆయన తో పోలిస్తే అంతకు ముందు ఉన్న బిజెపి అధ్యక్షుడు హరిబాబు ఇంకా బెట.ర్ అసలు తమ భవిష్యత్ కార్యాచరణపై ఎటువంటి ప్రణాళిక లేకుండా సాగుతున్న కనిపిస్తున్న బిజెపి ఇలా ఏపీ పై ఆశలు పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం అన్నది ఇక్కడ ప్రశ్న.
కాస్తో కూస్తో ఈటు బ్యాంకు ఉన్న పవన్ కళ్యాణ్ మాట్లాడితేనే అందరూ నవ్విపోతారు. అలాంటిది సోము వీర్రాజు జనసేన ను పక్కనపెట్టి కేవలం ఇదీ తమ పార్టీ పవర్ అని మాట్లాడటం చూస్తుంటే అసలు మళ్ళీ అధ్యక్షుడి విషయంలో బిజెపి ఏపీలో చాలా తప్పుడు నిర్ణయం తీసుకుందని అందరికీ అనిపిస్తుందేమో.