ఎజన్సీ ప్రాంతంలో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోనే ప్రయత్నం చేసారు.
తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం సరివెల గ్రామం వద్ద మావోయిస్టులు మంగళవారం రాత్రి ఆర్ టిసి బస్సు తగులబెట్టారు. చింతూరు నుంచి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిలో తెలంగాణ రాష్ట్రం తాండూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సును దగ్ధం చేశారు.
చత్తీస్ ఘడ్ కు చెందిన లారీని కూడా తగలబెట్టారు.
ఈ నెల 31వ తేదీ మావోయిస్టుల బంద్ పిలుపు నేపధ్యంలో వారు ఉనికి చాటుకోవడం కోసం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.
బస్సులోని ప్రయాణికులు అందరిని దించి సాయుధ మావోయిస్టులు బస్సును తగులబెట్టినట్లు తెలిసింది. ఈ ఘటనతో తూర్పు మన్యం ఉలిక్కిపడింది.