2 రోజుల క్రితం రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య ఆడియో టేప్ ఒకటి సంచలనాత్మకంగా ఏపీ రాష్ట్రమంతటా ప్రసారం అయిన విషయం తెలిసిందే. ఏబీఎన్ ఛానల్ లో చిత్తూరు జిల్లా మెజిస్ట్రేట్ రామకృష్ణ తో ఫోన్ సంభాషణలో ఈశ్వరయ్య ఢిల్లీ జడ్జీల సంగతి చూస్తా అని చెప్పడం…. హైకోర్టు ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ పై చర్యలు తీసుకోవాలని ఆ విధంగానే లెటర్ రాశాను అని చెప్పడం…. అలాగే నిన్ను జగన్ దగ్గరికి వెళ్లి తీసుకువెళ్లి విషయం చూస్తా అని చెప్పడం…. అంతేకాకుండా తోట్ జడ్జిలను తిట్టడం లాంటివి కూడా వినిపించాయి.
ఇక మనం ఎంతో గౌరవించే జడ్జీల లోగుట్టు వ్యవహారాలు, వారి మాటలు ఇలా ఉంటాయా అని అందరూ ముక్కున వేలేసుకునేలా మాట్లాడిన ఈశ్వరయ్య ఆ రోజు ఏబీఎన్ ఛానల్ ఫోన్ చేస్తే రామకృష్ణ ఎవరో నాకు తెలియదు.. ఆడియో నాది కాదు అని చెప్పారు. ఆ రెండు రోజుల తర్వాత ఈ విషయం పై ప్రెస్ మీట్ పెట్టి ఈశ్వరయ్య తనపై జరుగుతున్న ఆడియో టేప్ గురించి వస్తున్న వార్తల గురించి వివరించే ప్రయత్నం చేశారు.
ఇదే క్రమంలో ముందేమో నాకు, ఆ ఆడియో టేప్ కి ఏమి ఏమి సంబంధం లేదు అసలు రామకృష్ణ అంటే ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పిన మనిషి ఇప్పుడేమో ఫోన్ మాట్లాడిన విషయం నిజమే అని ఒప్పుకున్నారు. అయితే అందులో ఆడియో ట్యాంపరింగ్ చేసి పెట్టారు అని చెప్పుకొచ్చారు. ట్యాంపరింగ్ అంటే మిమిక్రీ చేసి పెట్టారా అని విలేకరులు అడగ్గా అవి అంతా తనకు తెలియదని…. ఆడియోలో తేడా మాత్రం ఉందని రామకృష్ణ తో మాట్లాడింది నిజం అని అన్నారు.
ఇలా కోర్టుని, జడ్జిని దుర్భాషలాడిన ఈశ్వరయ్య రోజుకొక మాట మాట్లాడుతూ కొత్త వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. ఇది మీ వ్యక్తిగత ఫోన్ సంభాషణా అని ఆయనని విలేకరుల అడుగుతున్న పలు ప్రశ్నలకు ఇబ్బంది పడి విలేకరుల సమావేశం అర్ధాంతరంగా ముగించుకొని వెళ్ళిపోయారు.