పవర్ లో ఉన్నప్పుడు చిన్నాచితక ఎమ్మెల్యే తమ అధికారాన్ని వాడుకునేందుకు ఆర్థికంగా ప్రజాధన్నాన్ని ఖర్చు చేసేందుకు వెనుకాడరు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న అతను కనీసం ఏడున్నర కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయడంలో ఇలాంటి ఆశ్చర్యం ఉండదు. చాలా మంది రాజకీయ నాయకులు ఇప్పటికే ఎన్నో సార్లు తమని అడిగే వారు లేరన్న ధీమాతో ఎన్నోసార్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈ విషయాలను పెద్దగా పట్టించుకోరు కాబట్టి ప్రజాప్రతినిధులు దుబారా ఖర్చు గురించి చెప్పాల్సిన అవసరం లేకుండా పోతుంది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ను ఇదే తరహాలో ఓ దుబారా ఖర్చు వెంటాడుతోంది.
2019 ఎన్నికల ముందు చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు సంబంధించి తాజాగా లోకాయుక్తలో వి. రమణ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఈ దీక్షకు .7.5 కోట్ల రూపాయల ప్రజాధనం బాబు దుర్వినియోగం చేశారని ఫిర్యాదు లో రమణ ఆరోపించారు. 2019లో దీక్ష చేపట్టిన చంద్రబాబు ఏపీ నుంచి ఢిల్లీ కి ప్రత్యేకంగా రైళ్ళు నడిపారు. దీంతో పాటు బీజేపీ వ్యతిరేక పోరాటం చేసే ప్రయత్నంలో ఆయా పార్టీల నేతల దీక్షకు ఆహ్వానించి ఆ ఖర్చంతా ప్రజాధనం నుండే పెట్టారు. అప్పట్లోనే బిజెపి, ప్రధాని మోడీ పై తీవ్రంగా నిప్పులు చెరిగారు. గతంలోనే ప్రజాధనాన్ని రాజకీయాల కోసం దుర్వినియోగం చేయడం పై బిజెపి, వైసిపి ఆరోపించాయి
ఈ నేపథ్యంలో అంశంపై జూలై 4న లోకాయుక్తలో ఫిర్యాదు చేయగా తాజాగా అగస్తూ 7న కేసు నమోదు అయింది. ఇక ఈ కేసు విచారణ అక్టోబర్,1 2020 నాటికి వాయిదా పడింది. అలాగే ఇదొక్కటే కాకుండా టిడిపి హయాంలో అవినీతిపై విచారణ జరపాలని కూడా లోకాయుక్తలో ఫిర్యాదు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇక వీటి పై లోకాయుక్త ఎటువంటి చర్యలు తీసుకుంటారన్న విషయం ఇప్పుడు ఆసక్తిగా ఉంది.