టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్స్ అయినవాళ్ళు ఇద్దరు. ఒకరు యంగ్ హీరో విజయ్ దేవరకొండ..మరొకరు ఆ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. మొదటి సినిమా అర్జున్ రెడ్ది తో టాలీవుడ్ దృష్ఠిని ఆకట్టుకున్నాడు. దాంతో తన నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లాంటి వాళ్ళ కోసం కథ సిద్దం చేస్తున్నాడు..ఆ హీరో లతో సందీప్ రెడ్డి నెక్స్ట్ సినిమా..అంటూ రకరకాల వార్తలు వచ్చాయి.
కాని చివరికి తెలుగు అర్జున్ రెడ్డి సినిమానే బాలీవుడ్ లో తీసే ఛాన్స్ వచ్చింది. షాహిద్ కపూర్, కియారా అద్వాని జంటగా అక్కడ కబీర్ సింగ్ అన్న టైటిల్ తో అర్జున్ రెడ్డి ని తీశాడు. బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు అక్కడ నటించిన హీరో, హీరోయిన్స్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా హీరో షాహిద్ కపూర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తన మార్కెట్ కూడా బాగా పెరిగింది. అయితే ఆ తర్వాత సందీప్ రెడ్డి సినిమా ఏంటన్నదే జనాలలో పెద్ద కన్ఫ్యూజన్.
బాలీవుడ్ లోనే తన నెక్స్ట్ సినిమా ఉండబోతుందన్న ప్రచారం మొదలైంది. ప్రాజెక్ట్ కూడా కన్ఫర్మ్ అయింది. ఇక సెట్స్ మీదకి వెళ్ళడమే ఆలస్యం అనుకునే లోపు కరోనాతో లాక్ డౌన్. దాంతో సందీప్ రెడ్డి బాలీవుడ్ లో చేయాల్సిన ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. ఇక ఈ లాక్ డౌన్ లో ఒక పెద్ద హీరో కోసం భారీ స్థాయిలో ఉండే పాన్ ఇండియా రేంజ్ సబ్జెక్ట్ ని సిద్దం చేసినట్టు తెలుస్తుంది.
ఈ కథ గనక సినిమాగా తెరకెక్కితే సునామీనే అని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఈ కథ గనక వింటే స్టార్ హీరోలు కూడా సందీప్ తో సినిమా చేయాలనే భావనకి వచ్చేస్తారన్న మాట కూడా వినిపిస్తుంది. మొత్తానికి సందీప్ రెడ్డికి లాక్ డౌన్ బాగానే ఉపయోగపడిందని తెలుస్తుంది. ఇక ఆమద్య సందీప్ రెడ్డి, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో అర్జున్ రెడ్డి సీక్వెల్ రాబోతుందని వార్తలు వచ్చాయి. మరి ఈ సీక్వెల్ ఉంటుదా లేదా అన్నది చూడాలి.