ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలానికి చెందిన శిరోముండనం కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నూతన్ నాయుడు భార్య మధుప్రియపై కేసు నమోదైంది. ఆమెతో పాటు ఇంటి సహాయకులు వరహాలు, ఝాన్సీ, ఇందిర, రవి, సౌజన్య, బాలులపై కేసులు నమోదయ్యాయి.
శ్రీకాంత్ అనే దళిత యువకుడిపై దాడి చేసినట్లుగా ఫిర్యాదులో ఉంది. విశాఖ సీపీ ఈ విషయంలో మాట్లాడుతూ బాధితుడిని కర్రలతో, ఇనప రాడ్లతో కొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీలో ఉన్నట్లు తెలిపారు. ఈ కేసు విషయంలో మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు తెలియజేసారు. ఇంట్లో సెల్ ఫోన్ దొంగతనం జరిగిందని మాట్లాడాలని పిలిపించి క్షరకుడితో శ్రీకాంత్ గుండు కొట్టినట్లు తెలుస్తోంది. బాధితుడు మీడియా ద్వారా విషయం వెలుగులోకి తెచ్చాడు.