ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ పరిపాలన పరంగా ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని పార్టీలో కీలక నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కి పెద్ద తలనొప్పిగా మారిందట. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరూ పార్టీ పరువు తీసేలా మీడియాలో ఒకరిపై ఒకరు వ్యతిరేక కథనాలు ప్రసారం చేయించుకుంటున్నారట. ఈ విషయం గుంటూరు జిల్లా రాజకీయాల్లో వైరల్ కావడంతోపాటు పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
దీంతో వెంటనే సదరు ఎమ్మెల్యే ని మరియు ఎంపీ ని వైయస్ జగన్ తాడేపల్లి లో తన ఆఫీస్ కి పిలిపించుకుని మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. పార్టీ పరంగా, పరిపాలన పరంగా అంతా బాగానే ఉన్నా గాని ఇలా అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలు చేస్తే పార్టీ పరువు పోతుందని ఇద్దరికి క్లాస్ పీకారట. ఇలానే వ్యవహరిస్తే కింద క్యాడర్ లో కూడా విభేదాలు రావడం గ్యారెంటీ అని, ఏదైనా గొడవ అనిపిస్తే పార్టీ పెద్దల మధ్యలో కూర్చొని మాట్లాడుకోండి పంచాయతీ చేసుకోండి అని సూచించారట.
ఇంకోసారి మీడియా వర్గాల్లో ఇదే విషయం రిపీట్ అయితే చర్యలు గట్టిగా ఉంటాయి అని సదరు ఎంపీకి ఎమ్మెల్యేకి జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. చాలా వరకు వైసిపి పార్టీ లో నాయకుల వల్లే ఎక్కువ పొలిటికల్ డ్యామేజ్ జరుగుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. ఎక్కడా ఎలాంటి సమస్య లేవనెత్తాలి అని ప్రతిపక్షాలు చూసినా జగన్ ఛాన్స్ ఇవ్వని పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో సొంత పార్టీ నేతల వివాదాల వల్లే చాలావరకు ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తున్నట్లు జగన్ గుర్తించడంతో… పార్టీ గొడవలు మీడియా వరకు వెళ్లే అవకాశం ఉండకూడదు అని పార్టీ పెద్దలకు కూడా గట్టిగా సూచించారట.