NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రాజు గారి కామిడీ పీక్స్ కి చేరింది..!! పులివెందుల వెళ్తారట..!!

(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

వైసీపీ రెబల్ ఎంపి నర్సాపురం రాజు గారి కామిడీ రోజురోజుకు పీక్స్ కి చేరుతోంది. ఢిల్లీ వేదికగా మీడియాతో ఆయన ఏదోదో మాట్లాడుతుండటం, దాన్ని కొన్ని వర్గాల మీడియాలు హైలెట్ చేస్తుండటం ఆయనకు కూడా భలే సరదాగా ఉన్నట్లు ఉంది. అందుకే ఉన్నదీ లేనిదీ అనవసర టాపిక్, లేని అంశాలను, అనవసర అంశాలను, అసందర్భమైన విషయాలను తీసుకువచ్చి మీడియా ముందు పెట్టి సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో రాజకీయాలను దద్దరిల్లిస్తున్నారు, ప్రతి రోజూ మీడియాతో ఏదో ఒక అంశాన్ని మాట్లాడుతూ వైసీపీని, జగన్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంత వరకు విజయవంతం అవుతుందో తెలియదు కానీ ఆయన మాత్రం మీడియాకు కామెడీ పీస్ గా దొరికారని ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతోంది. తాజాగా ఆయన ఈ రోజు కూడా ఏమన్నారంటే సాక్షాత్తు పులివెందుల వెళ్ళి జగన్మోహనరెడ్డికి వ్యతిరేకంగా వేలాది మందితో సభ పెడతానని కితకితలు పెట్టారు.

Raghurama Krishnam-Raju

కరోనా తగ్గిన తరువాత తన నియోజకవర్గం నర్సాపురంలోనే కాదు పులివెందులకూ వెళ్లి పదివేల మందితో సభ పెడతానని చెప్పుకొచ్చారు రఘురామ కృష్ణం రాజు. అమరావతి భూములపై పునః సమీక్ష కుదరదని హైకోర్టు చెప్పడాన్ని ఆయన స్వాగతిస్తూ న్యాయ వ్యవస్థను తప్పుబట్టడం సరికాదని అన్నారు. రాజ్యంగం అంటే ఏపి ప్రభుత్వానికి గౌరవం లేదనీ విమర్శించారు రఘురామ కృష్ణం రాజు. అమరావతి భూముల విషయంపై వైసీపీ ఎంపిలు పార్లమెంట్ ఆవరణలో సీబీఐ విచారణ డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేయడంపై రఘురామ కృష్ణం రాజు మాట్లాడుతూ ఓ వైపు న్యాయ వ్యవస్థపై దాడి చేస్తూనే గాంధీ విగ్రహం వద్ద రచ్చ చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చే హక్కు అసెంబ్లీకి లేదన్న కనీస అవగాహన కూడా వీరికి లేదని విమర్శించారు. న్యాయ వ్యవస్థను గౌరవించడం నేర్చుకోవాలని రఘురామ కృష్ణంరాజు హితవు పలికారు.

గత ప్రభుత్వ నిర్ణయాలపై మంత్రివర్గ ఉప సంఘం వేయడం హస్యాస్పదమన్నారు. వైసీపీ ప్రభుత్వం కూడా భవిష్యత్తులో మాజీ ప్రభుత్వం అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు రఘురామ కృష్ణం రాజు. అవ భూముల కుంభకోణంపై ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న రఘురామ కృష్ణం రాజు అమరావతి భూములపై సీబీఐ విచారణ కోరుతున్న వాళ్లు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ పై ఎందుకు ప్లకార్డులు ప్రదర్శించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థపై జరుగుతున్న దాడిపై తాను నిరసన వ్యక్తం చేస్తున్నానని రఘురామ కృష్ణం రాజు పేర్కొన్నారు.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri