NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రగిలిపోతున్న రాజోలు వైసిపి నేతలు! ఎందుకంటే…?

తూర్పుగోదావరి జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం చిత్ర విచిత్రంగా ఉంది.ఆ నియోజకవర్గానికి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తుండగా,ఆయన ఇంకా అధికారికంగా వైసిపికి జై కొట్టకపోయినా మంత్రిస్థాయి వైసిపి నాయకులు కూడా ఆయన చుట్టూ తిరుగుతున్నారట.

rajolu ysrcp leaders are fire about
rajolu ysrcp leaders are fire about

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన గెలుచుకున్న ఏకైక నియోజకవర్గం రాజోలు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పటికీ రాపాక మాత్రం రాజోలులో నెగ్గారు.దీంతో అసెంబ్లీలో తమ ప్రతినిధి ఉన్నాడన్న జనసేన ఆనందం కొద్ది రోజుల్లోనే ఆవిరైపోయింది.రాపాక వరప్రసాద్ వైసిపి నేతలతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు.ఈమధ్య ఒక వీడియోలో ఆయన తనకసలు వైసీపీ టిక్కెట్ రావాల్సిందని కాకుంటే అనివార్య కారణాల వల్ల జగన్ ఇవ్వలేకపోవడంతో తాను జనసేనలో కొచ్చి గెలిచానని చెప్పుకున్నారు.అయితే అసెంబ్లీ లో అడుగు పెట్టిన రోజే ముఖ్యమంత్రి జగన్ తన భుజం తట్టి కలిసి పని చేసుకుందామన్నాడని ఆయన మాట ప్రకారమే తాను నడుచుకుంటానని రాపాక ఆ వీడియోలో చెప్పేశారు.అసెంబ్లీలో కూడా పూర్తిగా వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ చిత్ర పటాలకు పాలాభిషేకాలు చేస్తూ ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే మాదిరి చెలామణి అవుతున్నారు.

కాకుంటే ఇప్పటివరకు రాపాక వరప్రసాద్ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల మాదిరి వైసిపికి జగన్ సమక్షంలో జైకొట్టలేదు.ఇక రాజోలు నియోజకవర్గం విషయానికొస్తే అక్కడ వైసిపి నాయకులుగా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన అమ్మాజీ ,అంతకు ముందు ఎన్నికలలో పరాజితుడైన రాజేశ్వర్రావు ఉన్నారు.అమ్మాజీ ఇప్పటికీ నియోజకవర్గ వైసిపి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు.అయితే పార్టీ అధినేతలు రాజోలు వరకు రాపాక కి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కన్పిస్తోంది.ఇటీవల రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన ఒక క్యాబినెట్ మంత్రి సొంత వైసిపి నేతలను పక్కనబెట్టి రాపాక తోటే కార్యక్రమాలన్నీ నిర్వహించటం అక్కడ రాజకీయ దుమారం రేపింది.మంత్రి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిని అక్కడి సీనియర్ నాయకుడిని కాదని పార్టీలోకి ఇంకా రాని రాపాకను వెనకేసుకు తిరగడంపట్ల పార్టీ వర్గాలు రగిలిపోతున్నాయి.ఇలాంటి చర్యలు పార్టీ క్యాడర్ కు ఎలాంటి సంకేతాలిస్తాయని అర్థం చేసుకోవాలని వారు అంటున్నారు.ఈ విషయమై తూర్పుగోదావరి జిల్లా పార్టీఇన్చార్జ్ వైవీ సుబ్బారెడ్డికి రాజోలు నేతలు ఫిర్యాదు చేశారని ఆయన పంచాయితీ నిర్వహిస్తున్నట్టు సమాచారం.

Related posts

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N