NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అమిత్ షా స‌త్తా తేలిపోతుంది … మోడీ గెలుస్తారా?

రాజ‌కీయ చాణ‌క్యుడు అనే పేరున్న కేంద్ర హోం మంత్రి , బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా స‌త్తాకు ఇది గ‌ట్టి ప‌రీక్షే. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కి ప‌రువు స‌మ‌స్య‌గా మారిన అంశంలో `షా` ఎత్తుగ‌డ‌లు ఫ‌లిస్తాయా? అనేది అంద‌రి దృష్టిని కేంద్రీక‌రించిన అంశం. ఇదంతా రైతుల ఆందోళ‌నల గురించి.

 

కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకోవాలంటూ తమ ఉద్యమాన్ని రైతులు ఉధృతం చేస్తున్నారు. మంగ‌ళ‌వారం భార‌త్ బంద్‌ను సైతం నిర్వ‌హించారు. భారత్‌ బంద్‌కు కాంగ్రెస్, ఎన్‌సిపి, ఆమ్ ఆద్మీ పార్టీ, డిఎంకె, టిఆర్‌ఎస్, వాపక్షాలు సహా ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ప్ర‌ధాన పార్టీల మ‌ద్ద‌తుతో ఆందోళ రూపం హీటెక్కింది. ఈ త‌రుణంలో అమిత్ షా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

రంగంలోకి అమిత్ షా

కొత్త చ‌ట్టాల ఉప‌సంహ‌ర‌ణ విష‌యంలో రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేస్తున్నాయి. రైతులతో ఐదు సార్లు కేంద్రం చర్చలు జరిపిన‌ప్ప‌టికీ ఎలాంటి ముందడుగు పడలేదు. ప్రతీసారి చర్చలు అర్థాంతరంగానే ముగిశాయి. ఆ సమావేశాలకు వెళ్తున్న రైతు సంఘాల నేతలు.. ప్రభుత్వం ఏర్పాటు చేసే భోజనాలను కూడా స్వీకరించడం లేదు. వాళ్ల ఫుడ్‌ను వాళ్లే బయటి నుంచి తెప్పించుకుని తింటున్నారు. ఓవైపు తమ ఉద్యమంపై తప్పుడు ప్రచారం జరుగుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోరాటం కొనసాగిస్తున్నారు. మొత్తంగా.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారీ నిరసనలు వ్యక్తం అవుతున్న సమయంలో.. ఎలాగైనా రైతుల సమస్యలకు చెక్ పెట్టాలని భావిస్తోన్న సర్కార్.. ఆరో రౌండ్‌ చర్చలకు సిద్ధం అయింది. రైతు సంఘాల ప్రతినిధులతో నేడు చర్చలు జరపాల్సి ఉన్నప్ప‌టికీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా భార‌త్ బంద్ జ‌రిగిన మంగ‌ళ‌వారం రోజు రాత్రే రైతులను చర్చలకు ఆహ్వానించారు.

రైతు సంఘాలు ఏమంటున్నాయి ?

హోంమంత్రి స‌మావేశం నేప‌థ్యంలో రైతుల నాయకుడు రాకేష్‌ టికైట్ మీడియాతో మాట్లాడుతూ , “భారత్ బంద్‌లో భాగంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్డు రావాణా మరియు రైలు ప్రయాణాలను తాకింది. అనేక రహదారులను దిగ్బంధం చేశారు. మార్కెట్లను మూసివేశారు. అన్నిరకాల వస్తు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో షా ఫోన్ చేసి చర్చలకు ఆహ్వానించారు. ఢిల్లీ సమీపంలోని రహదారులపై నిరసన తెలిపే వివిధ రైతు సంఘాల ప్రతినిధులతో కలిసి ఈ సమావేశానికి హాజరవుతాం` అని వెల్లడించారు . కాగా, త‌క్ష‌ణం ప‌రిష్కారం దొరికినా లేదా త‌ర్వాత వెల్ల‌డైనా కూడా అమిత్ షా నిర్వ‌హించే ఈ స‌మావేశం రైతుల ఆందోళ‌న‌లో కీల‌క మెట్టుగా మారుతుంద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N